Skip to main content

వ్యాక్సిన్ అవసరం లేకుండానే... కరోనాను ఖతం చేసే ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు!

 


కరోనా సోకకుండా టీకాను కనుగొనేందుకు ఎన్నో దేశాలు తలమునకలై ఉన్న వేళ, కరోనా సోకిన వారి శరీరంలో నుంచి వైరస్ ను పారద్రోలే ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన కంప్యూటర్ సిములేషన్స్ ను వినియోగించి, ఇప్పటికే అందుబాటులో ఉన్న 'ఎబ్సెలీన్' కరోనా శరీరంలో పునరుత్పత్తి కాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు రకాల రుగ్మతలకు వినియోగిస్తున్నారు. ఇది యాంటీ వైరల్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడేటివ్ గా, బ్యాక్టీరిసైడల్ గా శరీరంలోని కణజాలాన్ని కాపాడేదిగా గుర్తింపు తెచ్చుకుంది. వినికిడి సమస్యలు ఉన్నవారితో పాటు, బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వారికి ఇస్తున్నారు.

శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలను 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్ ప్రచురించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో రీసెర్చర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, వైరస్ ఆర్ఎన్ఏ జన్యువుల్లో ఎంప్రో ప్రొటీన్లను తయారు చేయడం ద్వారా, అది ఆశ్రయించుకుని ఉన్న శరీరంలోని కణజాలంలో మరో వైరస్ ను పుట్టిస్తోంది. వేలాది బయొలాజికల్ మాలిక్యూల్స్ మోడల్స్ ను వినియోగించి, శాస్త్రవేత్తలు, వైరస్ కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ వైరల్ మెటీరియల్ ను గుర్తించారు. వైరస్ లోని ఎంప్రోను నివారించే ఆయుధంగా ఎబ్సెలీన్ పనిచేస్తుందని అధ్యయనానికి కో-ఆథర్ గా పనిచేసిన చికాగో వర్శిటీ ప్రొఫెసర్ జువాన్ డీ పాబ్లో వ్యాఖ్యానించారు.

తమ అధ్యయనంలో భాగంగా ఎంజైమ్ మోడల్స్ ను అభివృద్ధి చేశామని, ఎబ్సెలీన్, రెండు విభిన్న మార్గాల ద్వారా ఎంప్రో యాక్టివిటీని తగ్గిస్తుందని గుర్తించామని తెలిపారు. దీంతో కరోనాను నమ్మకంగా నాశనం చేయవచ్చన్న నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులోనే ఎబ్సెలీన్ కొత్త ఔషధంగా కరోనాపై విరివిగా వినియోగంలోకి వస్తుందని అన్నారు.  

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

విశాఖ శంకుస్థాపనకు మోదీని పిలుస్తాం: బొత్స

  ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తామని... అదే విధంగా విశాఖ శంకుస్థాపనకు కూడా ప్రధాని మోదీతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అమరావతిని కూడా చంద్రబాబు గ్రాఫిక్స్ మాదిరి కాకుండా నిజంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అమరావతిలో పెండిగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాని, ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా, ఆర్బాటాలకు పోయి, అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని చెప్పారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని చెప్పారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను తామే పోషించుకుంటూ, న్యాయస్థానాలకు లోబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజం, నిజాయతీనే ఎప్పటికీ నిలుస్తాయని చెప్పారు.