Skip to main content

నిత్యానందుడి కైలాస విలాసం |

 కైలాస పురుష పుంగ‌వుడు నిత్యానంద మామూలోడు కాదు. ఆయ‌న గారి లీల‌లు చూడ‌త‌రం కావ‌డం లేదు. ఆధ్యాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందిన నిత్యానంద గుట్టు ర‌ట్టు అయ్యే స‌రికి దేశం విడిచాడు. ఆ త‌ర్వాత కైలాస వాసిగా స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు నిత్యానంద లేటెస్ట్ అప్‌డేట్‌కు వ‌స్తే...దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్త నుంచి ఆర్థిక‌వేత్త‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నారు. త‌న దేశంలో కైలాస రిజ‌ర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆయ‌న తాజా ప్ర‌క‌ట‌న సారాంశం. ఇప్ప‌టికే త‌న దేశానికి పాస్‌పోర్ట్‌, ప్ర‌త్యేక జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసిన విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు, ప్ర‌త్యేక కేబినెట్ ఏర్పాటుతో స్వ‌యం పాల‌న సాగిస్తున్న‌ట్టు నిత్యానంద ప్ర‌క‌టించి ఔరా అనిపించారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే రిజ‌ర్వ్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు ప్ర‌త్యేక క‌రెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ క‌రెన్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా వివిధ దేశాల‌తో ఒప్పందాలు కూడా చేసుకున్న‌ట్టు చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఈ క‌రెన్సీని చెలామ‌ణిలోకి తెచ్చేందుకు ఓ శుభ‌ముహూర్తాన్ని కూడా నిర్ణ‌యించారు.

గ‌ణేశ్ చతుర్థి సంద‌ర్భంగా ఈ నెల 22న హిందూ రిజ‌ర్వ్ బ్యాంక్‌ను స్థాపించ‌డంతో పాటు అదే రోజు నుంచి కైలాస క‌రెన్సీని అందుబాటులోకి తీసుకరానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదేదో గాలి మాట‌గా చెబుతున్న‌ది కాదండోయ్‌. అన్నీ చ‌ట్ట‌బ‌ద్ధంగా సాగుతున్న‌ట్టు కైలాస విలాస పురుషుడు చెప్పుకొచ్చారు.

ఇదే సంద‌ర్భంలో నిత్యానంద ఫోటోల‌తో అచ్చైన క‌రెన్సీ నోట్ల ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా నిత్యా నంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్‌ సంస్థ ఇంటర్‌పోల్‌ ఫిబ్రవరిలో బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. అయినా నిత్యానంద‌ను భార‌త్‌కు తీసుకొచ్చే మార్గం క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు విలాస‌పురుషుడు నిత్యానంద త‌న ప‌ని తాను చ‌క్క‌గా చేసుకుంటూ పోతున్నారు. మున్ముందు ఇంకా ఎన్నెన్ని మాయ‌లు చేస్తాడో చూడాలి మ‌రి. ఇంకెంత మంది అమ్మాయిల జీవితాల‌తో ఆడుకుంటాడో? 

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.