Skip to main content

నిత్యానందుడి కైలాస విలాసం |

 కైలాస పురుష పుంగ‌వుడు నిత్యానంద మామూలోడు కాదు. ఆయ‌న గారి లీల‌లు చూడ‌త‌రం కావ‌డం లేదు. ఆధ్యాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందిన నిత్యానంద గుట్టు ర‌ట్టు అయ్యే స‌రికి దేశం విడిచాడు. ఆ త‌ర్వాత కైలాస వాసిగా స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు. ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు నిత్యానంద లేటెస్ట్ అప్‌డేట్‌కు వ‌స్తే...దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఆధ్యాత్మిక వేత్త నుంచి ఆర్థిక‌వేత్త‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నారు. త‌న దేశంలో కైలాస రిజ‌ర్వ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఆయ‌న తాజా ప్ర‌క‌ట‌న సారాంశం. ఇప్ప‌టికే త‌న దేశానికి పాస్‌పోర్ట్‌, ప్ర‌త్యేక జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసిన విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు, ప్ర‌త్యేక కేబినెట్ ఏర్పాటుతో స్వ‌యం పాల‌న సాగిస్తున్న‌ట్టు నిత్యానంద ప్ర‌క‌టించి ఔరా అనిపించారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే రిజ‌ర్వ్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు ప్ర‌త్యేక క‌రెన్సీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ క‌రెన్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా వివిధ దేశాల‌తో ఒప్పందాలు కూడా చేసుకున్న‌ట్టు చెప్పి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఈ క‌రెన్సీని చెలామ‌ణిలోకి తెచ్చేందుకు ఓ శుభ‌ముహూర్తాన్ని కూడా నిర్ణ‌యించారు.

గ‌ణేశ్ చతుర్థి సంద‌ర్భంగా ఈ నెల 22న హిందూ రిజ‌ర్వ్ బ్యాంక్‌ను స్థాపించ‌డంతో పాటు అదే రోజు నుంచి కైలాస క‌రెన్సీని అందుబాటులోకి తీసుకరానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదేదో గాలి మాట‌గా చెబుతున్న‌ది కాదండోయ్‌. అన్నీ చ‌ట్ట‌బ‌ద్ధంగా సాగుతున్న‌ట్టు కైలాస విలాస పురుషుడు చెప్పుకొచ్చారు.

ఇదే సంద‌ర్భంలో నిత్యానంద ఫోటోల‌తో అచ్చైన క‌రెన్సీ నోట్ల ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా నిత్యా నంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్‌ సంస్థ ఇంటర్‌పోల్‌ ఫిబ్రవరిలో బ్లూకార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. అయినా నిత్యానంద‌ను భార‌త్‌కు తీసుకొచ్చే మార్గం క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు విలాస‌పురుషుడు నిత్యానంద త‌న ప‌ని తాను చ‌క్క‌గా చేసుకుంటూ పోతున్నారు. మున్ముందు ఇంకా ఎన్నెన్ని మాయ‌లు చేస్తాడో చూడాలి మ‌రి. ఇంకెంత మంది అమ్మాయిల జీవితాల‌తో ఆడుకుంటాడో? 

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.