Skip to main content

భార్య లేదని.. ఆమె మైనపు విగ్రహంతో గృహప్రవేశం..

 


వీడియో చూడండి: https://youtu.be/i5oGL8THq4Q

భార్య చనిపోతే ఆవిడా జ్ఞాపకాల తో ఇలా … తన భార్య ఓ రోడ్ ప్రమాదం లో చనిపోతే గృహాప్రేవేశానికి భార్య మైనం విగ్రహాన్ని తయారుచేయించి ఆ విగ్రహం తో కొత్త ఇంటి గృహప్రవేశ శుభకార్యం. చేసుకొన్నా ఓ సంఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించి కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు.

క్రితం గుప్తా సతీమణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య అంటే ఆయన ఎనలేని ప్రేమ. ఉన్నన్ని రోజులు దేవతలా చూసుకున్నారు.ఐతే ఇటీవల ఆయన ఇంట్లో గృహప్రవేశ వేడుక జరిగింది. భార్య లేకపోవడంతో.. ఆమె మైనపు బొమ్మను చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.గృహ ప్రవేశానికి వచ్చిన గుప్తా బంధువులు ఆమె మైనపు విగ్రహాన్ని చూసి ఆశ్చర్య పడ్డారు , ఆ తర్వాత కాస్త భయపడ్డారు, చివరికి అది మైనపు విగ్రహం అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు.గుప్తా సర్‌ప్రైజ్‌కు అందరి కళ్లో నీళ్లు తిరిగాయి. గుప్తా భార్యను స్మరించుకొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆమె మీద తన ప్రేమ ను ఆలా పంచుకొన్నార

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...