Skip to main content

భార్య లేదని.. ఆమె మైనపు విగ్రహంతో గృహప్రవేశం..

 


వీడియో చూడండి: https://youtu.be/i5oGL8THq4Q

భార్య చనిపోతే ఆవిడా జ్ఞాపకాల తో ఇలా … తన భార్య ఓ రోడ్ ప్రమాదం లో చనిపోతే గృహాప్రేవేశానికి భార్య మైనం విగ్రహాన్ని తయారుచేయించి ఆ విగ్రహం తో కొత్త ఇంటి గృహప్రవేశ శుభకార్యం. చేసుకొన్నా ఓ సంఘటన కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించి కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు.

క్రితం గుప్తా సతీమణి రోడ్డు ప్రమాదంలో మరణించారు. భార్య అంటే ఆయన ఎనలేని ప్రేమ. ఉన్నన్ని రోజులు దేవతలా చూసుకున్నారు.ఐతే ఇటీవల ఆయన ఇంట్లో గృహప్రవేశ వేడుక జరిగింది. భార్య లేకపోవడంతో.. ఆమె మైనపు బొమ్మను చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.గృహ ప్రవేశానికి వచ్చిన గుప్తా బంధువులు ఆమె మైనపు విగ్రహాన్ని చూసి ఆశ్చర్య పడ్డారు , ఆ తర్వాత కాస్త భయపడ్డారు, చివరికి అది మైనపు విగ్రహం అని తెలుసుకొని నోళ్లు వెల్లబెట్టారు.గుప్తా సర్‌ప్రైజ్‌కు అందరి కళ్లో నీళ్లు తిరిగాయి. గుప్తా భార్యను స్మరించుకొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆమె మీద తన ప్రేమ ను ఆలా పంచుకొన్నార

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.