Skip to main content

చౌక ధరలో రెమెడిసివిర్ ఇంజక్షన్ ను ఆవిష్కరించిన జైడస్ కాడిలా

 


శరీరానికి సోకిన కరోనా మహమ్మారిని తరిమేసేందుకు గిలియన్ సైన్సెస్ తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వర్షన్ ను జైడస్ కాడిలా చౌక ధరకు ఆవిష్కరించింది. 100 ఎంజీ ఇంజక్షన్ ను తాము రూ. 2,800కు అందించాలని నిర్ణయించామని మార్కెట్లో ఇది 'రెమ్ డాక్' పేరిట అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కరోనాకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ ఔషధాన్ని విక్రయిస్తామని బీఎస్ఈ రెగ్యులేటరీ ఫైలింగ్ లో సంస్థ పేర్కొంది.

కాగా, ఇప్పటికే రెమెడిసివిర్ ను నాలుగు కంపెనీలు ఇండియాలో మార్కెటింగ్ చేస్తుండగా, ఇప్పుడు జైడస్ కాడిలా ఐదవ సంస్థగా నిలిచింది. హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లు ఇప్పటికే ఈ డ్రగ్ జనరిక్ వర్షన్ ను విడుదల చేశాయి. గిలియడ్ సైన్సెస్ మొత్తం 127 దేశాల్లోని కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుని రెమెడిసివిర్ తయారీకి అనుమతులను ఇచ్చింది.  

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.