రాష్ట్రాలలో భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి 94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైన ఉన్న జూరాలకు 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 28 గేట్లు ఎత్తి 2,23,948 క్యూసెక్కులను శ్రీశైలం, పరిసర కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇందులో 2,13,486 క్యూసెక్కులు డ్యాంకు చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 856 అడుగుల వద్ద 94.68 టీఎంసీల నిల్వలు నమోదు అయ్యాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment