Skip to main content

గడచిన వారం రోజులుగా భారత్ లో కరోనా వీర విజృంభణ: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్



 గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో 23 శాతం, మరణాల్లో 15 శాతం ఇండియాలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాఖ్యానించింది. ఇండియాలో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని, రోజువారీ కేసుల్లో, తొలి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, బ్రెజిల్ లను ఇండియా దాటేసిందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడించాయి. 


ఈ నెలలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ భారత్ లో 4,11,379 కొత్త కేసులు, 6,251 మరణాలు సంభవించాయని, ఇదే సమయంలో అమెరికాలో కేసుల సంఖ్య 3,69,575 కాగా, 7,232 మంది చనిపోయారని తెలిపింది. బ్రెజిల్ లో 3,04,535 కేసులు, 6,914 మరణాలు నమోదయ్యాయని, మరణాల విషయంలో మాత్రమే ఇండియా కొంత మెరుగైన గణాంకాలను చూపుతోందని వ్యాఖ్యానించింది.

కాగా, నాలుగు రోజుల పాటు సగటున 60 వేలను దాటిన కేసులు నిన్న మాత్రం 52 వేలకు పరిమితం కాగా, మొత్తం కేసుల సంఖ్య 22.68 లక్షలకు చేరిన సంగతి తెలిసిందే. తొలి లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా, ఆపై 10 లక్షల మార్క్ ను చేరుకునేందుకు 59 రోజులు మాత్రమే పట్టింది. ఆపై కేవలం 24 రోజుల్లోనే కేసుల సంఖ్య 22 లక్షలను దాటింది. ఇదే సమయంలో రికవరీలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి. రికవరీ రేటు 70 శాతంగా ఉండగా, ఇంతవరకూ 15.83 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. మరణాల రేటు 2 శాతం నుంచి 1.99 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక టెస్టుల విషయానికి వస్తే, ప్రతి పది లక్షల మందిలో 18,300 మందికి మాత్రమే ఇండియాలో టెస్టులు జరుగుతుండగా, ఈ విషయంలో అమెరికా ముందు నిలిచి, 1,99,803 మందికి టెస్టులు చేస్తుండగా, బ్రెజిల్ 62,200 మందికి పరీక్షలు చేస్తోంది. ఆగస్టు 9న ఇండియాలో అత్యధిక ఒకరోజు కేసులుగా 64,399 పాజిటివ్ లు నిర్ధారణ అయ్యాయి. ఇండియాలో టెస్టుల సంఖ్యను పెంచితే మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయం.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.