Skip to main content

మా వ్యాక్సిన్ ను పంపాలని ఇండియా కోరింది... పరిశీలిస్తున్నామన్న రష్యా!

 


కరోనా మహమ్మారిని జయించే దిశగా తాము ముందడుగు వేశామని, తొలి వ్యాక్సిన్ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రష్యాపై నమ్మకంతో ఈ వ్యాక్సిన్ ను తమకు అందించాలని ఇండియా సహా 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని రష్యా స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా తదితర దేశాలు 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ ను కోరాయని ఓ ప్రకటనలో తెలిపింది.


ఆర్డీఐఎఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు కాగా, నేడు తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు దీన్ని ఇవ్వనున్నారు. సెప్టెంబర్ లో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున ప్రారంభించి, ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోస్ లను తయారు చేసి అందించాలని రష్యా లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను అందిస్తే, తాము కూడా తయారు చేస్తామంటూ పలు దేశాల ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని రష్యా పేర్కొంది.

కరోనాకు వ్యాక్సిన్ తమ దేశం నుంచి తొలిసారి రావాలన్న పట్టుదలను కనబరిచిన పుతిన్ ఆదేశాలతో ట్రయల్స్ కాల పరిమితిని కుదించిన సంగతి తెలిసిందే. సోవియట్ యూనియన్ కాలంలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి శాటిలైట్ స్పుత్నిక్ పేరును ఈ వ్యాక్సిన్ కు పెట్టారు. ఇక వచ్చే ఐదేళ్ల వ్యవధిలో వివిధ దేశాల సహకారంతో సాలీనా 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేస్తామని ఆర్డీఐఎఫ్ అధినేత కిరిల్ దిమిత్రీవ్ తెలియజేశారు.

కాగా, అడినో వైరస్ సహకారంతో గమలేయా సంస్థ ఈ వ్యాక్సిన్ ను రష్యా ప్రభుత్వ సహకారంతో తయారు చేసింది. చైనాలోని కాన్ సినో తయారు చేసిన వ్యాక్సిన్ ప్రొటోటైమప్ ఆధారంగా ఈ వ్యాక్సిన్ ను గమలేయా రూపొందించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న గమలేయాకు చెందిన రీసెర్చర్లు, డైరెక్టర్లు, ఈ వ్యాక్సిన్ ప్రొటోటైప్ ను తమకు తాము ఇంజక్ట్ చేసుకోవడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. అయినా, ఈ విషయంలో ముందడుగు వేయాలనే నిర్ణయించుకున్న రష్యా, ట్రయల్స్ ను పూర్తి చేసి తొలి వ్యాక్సిన్ ను తామే అందించామని చెప్పుకుంది.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...