వినాయక చవితి వస్తుంది అంటేనే అందరి చూపులు ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతి పైనే ఉంటాయి , భారీ గణపతి విగ్రహాల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 సంవత్సరానికి గాను ఖైరతాబాద్ మహాగణపతిని కేవలం 6 అడుగుల ఎత్తుతో మట్టితో తయారుచేస్తున్నామని ” ధన్వంత్రి నారాయణ మహాగణపతి” ఆకారంలో వినాయకుడి తయారు చేస్తున్నట్లు తెలిపారు
ఖైరతాబాద్: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులను బుధవారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు
ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.
Comments
Post a Comment