Skip to main content

దేశంలో ఒక్కరోజులో వెయ్యికి పైగా కరోనా మరణాలు.. అంతకంతకు పెరిగిపోతోన్న కేసులు

 



దేశంలో కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 64,553 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1007 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

     దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 24,61,191కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 48,040 కి పెరిగింది. ఇక 6,61,595 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 17,51,556 మంది కోలుకున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

గెజిట్ పై హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లును ఇటీవలే గవర్నర్ ఆమోదించగా, ఆ వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాజధాని రైతు పరిరక్షణ సమితి స్పందించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గెజిట్ అమలు నిలిపివేయాలని, సీఎం కార్యాలయం, రాజ్ భవన్, సెక్రటేరియట్ ను ఇక్కడి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును కోరింది. కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.