Skip to main content

పవన్ సినిమా కోసం దర్శకుల మధ్య పోటీ!

 

పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు. పవన్ ని కొత్త కోణంలో చూపించాలన్న తాపత్రయంతో కథలు తయారుచేసుకుంటూ వుంటారు. ఇప్పుడు కూడా అలాగే ముగ్గురు దర్శకులు ఆయన సినిమా ఛాన్స్ కోసం కథలు తయారుచేస్తున్నారు.

ఆమధ్య ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన పవన్.. ఇటీవల కాస్త విరామం తీసుకుని మళ్లీ సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముందుగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందుతోంది. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఆ తదుపరి ఆయన నటించే 29వ సినిమా కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఆయనకు ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణ పనుల్లో వున్నారాయన. అయితే, దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, డాలీ, గోపీచంద్ మలినేని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ ని మెప్పించే కథ ఎవరు తెస్తే వారికే ఛాన్స్ ఇవ్వాలని నిర్మాత నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులూ తమతమ కథల రూపకల్పనలో పడ్డారట!    

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...