Skip to main content

పవన్ సినిమా కోసం దర్శకుల మధ్య పోటీ!

 

పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం చాలామంది దర్శకులు వెయిట్ చేస్తుంటారు. పవన్ ని కొత్త కోణంలో చూపించాలన్న తాపత్రయంతో కథలు తయారుచేసుకుంటూ వుంటారు. ఇప్పుడు కూడా అలాగే ముగ్గురు దర్శకులు ఆయన సినిమా ఛాన్స్ కోసం కథలు తయారుచేస్తున్నారు.

ఆమధ్య ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన పవన్.. ఇటీవల కాస్త విరామం తీసుకుని మళ్లీ సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముందుగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందుతోంది. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా పవన్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఆ తదుపరి ఆయన నటించే 29వ సినిమా కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఆయనకు ఇప్పటికే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణ పనుల్లో వున్నారాయన. అయితే, దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి, డాలీ, గోపీచంద్ మలినేని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పవన్ ని మెప్పించే కథ ఎవరు తెస్తే వారికే ఛాన్స్ ఇవ్వాలని నిర్మాత నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులూ తమతమ కథల రూపకల్పనలో పడ్డారట!    

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...