Skip to main content

నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్

వీడియో చూడండి. Click here

ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో మనందరికీ తెలుసు. పర్యావరణమన్నా.. జీవరాశులన్నా.. ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ త‌న రోజువారీ ఉద‌య‌పు దిన‌చ‌ర్య‌లోని కొన్ని క్షణాలను వీడియోగా మలిచి ఇన్‌స్టాగ్రాం‌మ్‌ ద్వారా ఆదివారం పంచుకున్నారు.

‌ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో మనందరికీ తెలుసు. పర్యావరణమన్నా.. జీవరాశులన్నా.. ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ త‌న రోజువారీ ఉద‌య‌పు దిన‌చ‌ర్య‌లోని కొన్ని క్షణాలను వీడియోగా మలిచి ఇన్‌స్టాగ్రాం‌మ్‌ ద్వారా ఆదివారం పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నెమళ్లకు ఆహారం  అందిస్తున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే ప్రధానికి ప‌లు నెమ‌ళ్లు మ‌చ్చిక అయిన దృశ్యాలను ఈ వీడియోలో ఉంచారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోదీ విలువైన క్షణాలు అనే క్యాప్షన్‌తోపాటు హిందీలో రాసిన పద్యాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

ప్ర‌ధాని నివాస ప్రాంగ‌ణం, ఎల్‌కేఎం కాంప్లెక్స్‌లో నెమ‌ళ్లు స్వేచ్ఛ‌గా సంచ‌రిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వ్యాయమ దినచర్య సమయంలో, పలు సందర్భాల్లో మోదీ ప్ర‌తీరోజు వాటికి ఆహారాన్ని స్వ‌యంగా అందిస్తూ కనిపించారు. పలుసందర్భాల్లో నెమ‌ళ్లు పురివిప్పిన సుంద‌ర దృశ్యాలు మ‌న‌స్సుకు ఎంతో ఉల్లాసాన్నిస్తున్నాయి.  అయితే..  నివాస ప్రాంగ‌ణంలో ప్ర‌ధాని ప‌లు ప‌క్షుల‌కు గూళ్లను సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లందరూ తెగ సంబరపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం అన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై వైరల్ అవుతోంది. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...