Skip to main content

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?

 


ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్న ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నానని అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలన్న ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఖైరతాబాద్ వినాయకుడి సొంతమని అన్నారు. కరోనాను పారద్రోలడానికి, ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, వ్యాక్సిన్ తొందరగా రావాలి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, కరోనా వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా హెచ్చరించారని అన్నారు. డిసెంబర్ వరకు మహమ్మారి కనుమరుగు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...