Skip to main content

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి?

 


ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్న ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతున్ని కోరుకున్నానని అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞతలన్న ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఖైరతాబాద్ వినాయకుడి సొంతమని అన్నారు. కరోనాను పారద్రోలడానికి, ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, వ్యాక్సిన్ తొందరగా రావాలి. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, కరోనా వస్తుందని తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా హెచ్చరించారని అన్నారు. డిసెంబర్ వరకు మహమ్మారి కనుమరుగు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.