Skip to main content

మోహన్ బాబు ఇంటి ముందు ఆగంతకుల హల్ చల్



సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటి ముందు ఈ సాయంత్రం కొందరు ఆగంతకులు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం ఇలా వుంది.

ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో వున్న ఓ ఇన్నోవా కారు నగర శివార్లలో వున్న మంచు మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చింది. ఆ సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు అంతా జిమ్ లో వుండి వర్కవుట్ లు చేస్తున్నారు. ఇన్నోవా కారు కావడంతో, గార్డ్ కొత్తవాడు కావడంతో గేటు తీసి లోపలకు వదిలినట్లు బోగట్టా.

కారు తిన్నగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చిన తరువాత అందులోంచి దిగిన ఆగంతకులు గట్టిగా కేకలు వేసి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం లాంటి కేకలు వేసినట్లు బోగట్టా. కారులో వచ్చిన వారు కాస్త మద్యం సేవించి వున్నట్లు తెలుస్తోంది. ఇలా కాస్సేపు కేకలు వేసాక, వాళ్లంతట వాళ్లే కారులోకి ఎక్కడి, రివర్స్ చేసుకుని స్పీడ్ గా వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఈ మేరకు మోహన్ బాబు పోలీసులుకు విషయం వివరించారని, ఫిర్యాదు చేయబోతున్నారని, సిసి ఫుటేజ్, కారు నెంబర్ అన్నీ వున్నాయని తెలుస్తోంది

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.