Skip to main content

మోహన్ బాబు ఇంటి ముందు ఆగంతకుల హల్ చల్



సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటి ముందు ఈ సాయంత్రం కొందరు ఆగంతకులు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం ఇలా వుంది.

ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో వున్న ఓ ఇన్నోవా కారు నగర శివార్లలో వున్న మంచు మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చింది. ఆ సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు అంతా జిమ్ లో వుండి వర్కవుట్ లు చేస్తున్నారు. ఇన్నోవా కారు కావడంతో, గార్డ్ కొత్తవాడు కావడంతో గేటు తీసి లోపలకు వదిలినట్లు బోగట్టా.

కారు తిన్నగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చిన తరువాత అందులోంచి దిగిన ఆగంతకులు గట్టిగా కేకలు వేసి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం లాంటి కేకలు వేసినట్లు బోగట్టా. కారులో వచ్చిన వారు కాస్త మద్యం సేవించి వున్నట్లు తెలుస్తోంది. ఇలా కాస్సేపు కేకలు వేసాక, వాళ్లంతట వాళ్లే కారులోకి ఎక్కడి, రివర్స్ చేసుకుని స్పీడ్ గా వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఈ మేరకు మోహన్ బాబు పోలీసులుకు విషయం వివరించారని, ఫిర్యాదు చేయబోతున్నారని, సిసి ఫుటేజ్, కారు నెంబర్ అన్నీ వున్నాయని తెలుస్తోంది

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...