Skip to main content

మోహన్ బాబు ఇంటి ముందు ఆగంతకుల హల్ చల్



సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటి ముందు ఈ సాయంత్రం కొందరు ఆగంతకులు హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు అందించిన సమాచారం ఇలా వుంది.

ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో వున్న ఓ ఇన్నోవా కారు నగర శివార్లలో వున్న మంచు మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చింది. ఆ సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులు అంతా జిమ్ లో వుండి వర్కవుట్ లు చేస్తున్నారు. ఇన్నోవా కారు కావడంతో, గార్డ్ కొత్తవాడు కావడంతో గేటు తీసి లోపలకు వదిలినట్లు బోగట్టా.

కారు తిన్నగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చిన తరువాత అందులోంచి దిగిన ఆగంతకులు గట్టిగా కేకలు వేసి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం లాంటి కేకలు వేసినట్లు బోగట్టా. కారులో వచ్చిన వారు కాస్త మద్యం సేవించి వున్నట్లు తెలుస్తోంది. ఇలా కాస్సేపు కేకలు వేసాక, వాళ్లంతట వాళ్లే కారులోకి ఎక్కడి, రివర్స్ చేసుకుని స్పీడ్ గా వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఈ మేరకు మోహన్ బాబు పోలీసులుకు విషయం వివరించారని, ఫిర్యాదు చేయబోతున్నారని, సిసి ఫుటేజ్, కారు నెంబర్ అన్నీ వున్నాయని తెలుస్తోంది

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...