Skip to main content

ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ స్టార్ ప్రభాస్: బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్రశంసలు

 

బాహుబలి' తర్వాత మన దేశంలోని అగ్ర నటుల్లో ఒకరిగా ప్రభాస్ ఎదిగిపోయాడు. తాజాగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో 'ఆదిపురుష్' చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ వైరల్ అయింది. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించనున్నట్టు సమాచారం. మరోవైపు, ప్రభాస్ పై ఓంరౌత్ ప్రశంసలు కురిపించారు.


ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో ప్రభాస్ అని ఓంరౌత్ కితాబిచ్చారు. 'మోర్ దేన్ లైఫ్' సినిమాలను చేయగల హీరో అని ప్రశంసించారు. ఇదే సమయంలో 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ చెప్పారు. ఓవైపు మౌనమునిలా ఉంటూనే... గర్జించే పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపారు. ఇప్పటి వరకు కనిపించని ఓ డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడని చెప్పారు. ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రభాస్ శిక్షణ తీసుకోబోతున్నాడని వెల్లడించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...