Skip to main content

చైనా లో క‌ల‌క‌లం : ఆరు నెల‌ల త‌రువాత విజృంభిస్తున్న క‌రోనా



ఆరునెల‌ల త‌రువాత చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ట్లు తేలింది. చైనా కు చెందిన 68ఏళ్ల మహిళ క‌రోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

చైనా హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌జౌ కు చెందిన బాధితురాలి ఆరు నెల‌ల క్రితం వైర‌స్ సోకి న‌య‌మైంది. మ‌ళ్లీ అదే మ‌హిళ‌కు వైర‌స్ సోక‌డంపై డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వృద్ధురాలి కరోనా సోక‌డంతో ఆమెతో సంబంధం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి వైర‌స్ టెస్ట్ చేసిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ మానవ శరీరం నుండి కరోనావైరస్ ను తొలగించడానికి చాలా సమయం పడుతుందని, ఇది ఒక‌ అరుదైన కేస‌ని ఓ వైరాలజిస్ట్ చైనా స్టేట్ మీడియాతో చెప్పారు.

కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురించేస్తోంది.

కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని సందర్భాల్లో శరీరంలో వైరస్ మిగిలే ఉంటుందా.. అదే నిజమైతే దేహం నుంచి కరోనా పూర్తిగా తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను తాజా ఉదంతం తెరపైకి తెచ్చింది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...