Skip to main content

చైనా లో క‌ల‌క‌లం : ఆరు నెల‌ల త‌రువాత విజృంభిస్తున్న క‌రోనా



ఆరునెల‌ల త‌రువాత చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ట్లు తేలింది. చైనా కు చెందిన 68ఏళ్ల మహిళ క‌రోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

చైనా హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌జౌ కు చెందిన బాధితురాలి ఆరు నెల‌ల క్రితం వైర‌స్ సోకి న‌య‌మైంది. మ‌ళ్లీ అదే మ‌హిళ‌కు వైర‌స్ సోక‌డంపై డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వృద్ధురాలి కరోనా సోక‌డంతో ఆమెతో సంబంధం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి వైర‌స్ టెస్ట్ చేసిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ మానవ శరీరం నుండి కరోనావైరస్ ను తొలగించడానికి చాలా సమయం పడుతుందని, ఇది ఒక‌ అరుదైన కేస‌ని ఓ వైరాలజిస్ట్ చైనా స్టేట్ మీడియాతో చెప్పారు.

కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురించేస్తోంది.

కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని సందర్భాల్లో శరీరంలో వైరస్ మిగిలే ఉంటుందా.. అదే నిజమైతే దేహం నుంచి కరోనా పూర్తిగా తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను తాజా ఉదంతం తెరపైకి తెచ్చింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...