Skip to main content

చైనా లో క‌ల‌క‌లం : ఆరు నెల‌ల త‌రువాత విజృంభిస్తున్న క‌రోనా



ఆరునెల‌ల త‌రువాత చైనాలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ట్లు తేలింది. చైనా కు చెందిన 68ఏళ్ల మహిళ క‌రోనా నుంచి కోలుకున్న ఆరు నెలల తర్వాత మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

చైనా హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌జౌ కు చెందిన బాధితురాలి ఆరు నెల‌ల క్రితం వైర‌స్ సోకి న‌య‌మైంది. మ‌ళ్లీ అదే మ‌హిళ‌కు వైర‌స్ సోక‌డంపై డాక్ట‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వృద్ధురాలి కరోనా సోక‌డంతో ఆమెతో సంబంధం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి వైర‌స్ టెస్ట్ చేసిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ మానవ శరీరం నుండి కరోనావైరస్ ను తొలగించడానికి చాలా సమయం పడుతుందని, ఇది ఒక‌ అరుదైన కేస‌ని ఓ వైరాలజిస్ట్ చైనా స్టేట్ మీడియాతో చెప్పారు.

కరోనా తిరగబెట్టిన కేసులు గతంలో పలుమార్లు వెలుగు చూసినప్పటికీ ఇంతకాలం తరువాత ఆ వృద్ధురాలిలో కరోనా మళ్లీ నిద్రలేవడం శాస్త్రవేత్తలను, అధికారులను ఆందోళనకు గురించేస్తోంది.

కరోనా పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని సందర్భాల్లో శరీరంలో వైరస్ మిగిలే ఉంటుందా.. అదే నిజమైతే దేహం నుంచి కరోనా పూర్తిగా తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది.. వంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను తాజా ఉదంతం తెరపైకి తెచ్చింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...