Skip to main content

ఐదు దేశాల్లో మరో కొత్త వ్యాధి... జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరిక...


ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడి పోతున్నది.  కరోనా నుంచి బయటపడేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నది.  కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియడం లేదు.  ఇలాంటి సమయంలో అమెరికా మరో హెచ్చరిక చేసింది.  అమెరికాలో కరోనాతో పాటు మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ గుర్తించింది. 

ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో అధికంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జ్వరంగా మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలను దెబ్బతీస్తోందని, ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, చర్మంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెప్తున్నది.  కరోనా వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువుగా ఈ లక్షణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాతో పాటుగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ లో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది.  అమెరికాలో ఇప్పటి వరకు 600 పిల్లలకు ఈ వ్యాధి సోకింది.  దీని కారణంగా 10 మంది మరణించినట్టు అమెరికా సీడీసీ సంస్థ తెలిపింది.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...