Skip to main content

ఐదు దేశాల్లో మరో కొత్త వ్యాధి... జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెచ్చరిక...


ప్రపంచం మొత్తం కరోనాతో విలవిలలాడి పోతున్నది.  కరోనా నుంచి బయటపడేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నది.  కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియడం లేదు.  ఇలాంటి సమయంలో అమెరికా మరో హెచ్చరిక చేసింది.  అమెరికాలో కరోనాతో పాటు మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, చర్యల సంస్థ గుర్తించింది. 

ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో అధికంగా వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జ్వరంగా మొదలయ్యే ఈ వ్యాధి తరువాత శరీరంలోని మిగతా భాగాలను దెబ్బతీస్తోందని, ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, చర్మంపై దద్దుర్లు, గుండెల్లో మంట వంటివి కనిపిస్తున్నాయని ఆ సంస్థ చెప్తున్నది.  కరోనా వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువుగా ఈ లక్షణాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాతో పాటుగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ లో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది.  అమెరికాలో ఇప్పటి వరకు 600 పిల్లలకు ఈ వ్యాధి సోకింది.  దీని కారణంగా 10 మంది మరణించినట్టు అమెరికా సీడీసీ సంస్థ తెలిపింది.  

Comments

Popular posts from this blog

అరటిపండ్లు తినడానికి ఏం తొందరపడుతున్నాయో... గోవులతో పవన్ కల్యాణ్ మురిపెం

జనసేనాని పవన్ కల్యాణ్ తీరిక సమయాల్లో హైదరాబాద్ శివార్లలోని తన ఫాంహౌస్ లో గడుపుతారన్న విషయం తెలిసిందే. పవన్ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పోషిస్తున్నారు. అందుకోసం తన ఫాంహౌస్ లో గోశాల ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్ లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...