Skip to main content

ప్రభాస్ రేపు ఏం చెబుతాడో.... అభిమానుల్లో ఆసక్తి!

 సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓవైపున ప్రభాస్ ఉండగా, మరోవైపున ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆడియో కంపెనీ టీ సిరీస్ ప్రతినిధి ఉండడం చూడొచ్చు. టీ సిరీస్ ప్రతినిధి మాట్లాడుతూ, "హాయ్ ప్రభాస్, రేపటికి మీరు రెడీగా ఉన్నారా?" అని ప్రశ్నించగా, "చాలా ఎక్సైటింగ్ గా ఉంది, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను" అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. "లెట్స్ డూ ఇట్" అంటూ టీ సిరీస్ ప్రతినిధి ఉత్సాహంగా పిడికిలి బిగించాడు. ప్రభాస్ కూడా చిరునవ్వుతో పిడికిలి బిగించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.


కాగా, ప్రభాస్... టీ సిరీస్ నిర్మాణంలో ఓ బాలీవుడ్ సినిమా చేయనున్నట్టు అర్థమవుతోంది. కరణ్ జొహార్ తో కానీ, యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో కానీ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశాన్ని టీ సిరీస్ నిర్మాణ సంస్థ చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. రేపు ప్రభాస్ చెప్పే మ్యాటర్ తో దీనిపై మరింత క్లారిటీ రానుంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...