ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారు నియామకం జరిగింది. కొత్తగా అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా నియమితులైన అంబటి కృష్ణారెడ్డి వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై సర్కారుకు సలహాలు, సూచనలు అందిస్తారు. అంబటి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగన్నారు. ఈ పదవికి కేబినెట్ హోదా కల్పించారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment