Skip to main content

జియో బంపర్ ఆఫర్..ఏడాదిపాటు ఉచితంగా


యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభమవుతుంది. రూ.499 క్రికెట్‌ ప్లాన్‌ కింద జియో తన వినియోగదారులకు రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను 56 రోజులు అందిస్తుంది. ఇది క్రికెట్‌ సీజన్‌ అయిపోయే వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో  వినియోగదారులకు ఎటువంటి కాలింగ్ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు రావు.   మరో కొత్త ప్లాన్ రూ.399తో    డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు లభించనుంది. 

 రూ. 777   జియో క్రికెట్ ప్లాన్ కింద, 5GB అదనపు డేటాతో 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటాను కంపెనీ  తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత జియో నుండి జియో కాలింగ్ ప్రయోజనాలు, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000  ఎఫ్‌యుపి నిమిషాలు, రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు అందిస్తోంది.  ఈ ప్లాన్ 84 రోజుల  చెల్లుబాటుతో వస్తుంది. రూ .499 ప్లాన్ మాదిరిగానే, ఇది కూడా ఒక సంవత్సరానికి డిస్నీ + హాట్‌స్టార్ వీఐసీ  సబ్‌స్క్రిప్షన్‌తో వస్తోంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...