Skip to main content

జియో బంపర్ ఆఫర్..ఏడాదిపాటు ఉచితంగా


యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభమవుతుంది. రూ.499 క్రికెట్‌ ప్లాన్‌ కింద జియో తన వినియోగదారులకు రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను 56 రోజులు అందిస్తుంది. ఇది క్రికెట్‌ సీజన్‌ అయిపోయే వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో  వినియోగదారులకు ఎటువంటి కాలింగ్ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు రావు.   మరో కొత్త ప్లాన్ రూ.399తో    డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు లభించనుంది. 

 రూ. 777   జియో క్రికెట్ ప్లాన్ కింద, 5GB అదనపు డేటాతో 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటాను కంపెనీ  తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత జియో నుండి జియో కాలింగ్ ప్రయోజనాలు, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000  ఎఫ్‌యుపి నిమిషాలు, రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు అందిస్తోంది.  ఈ ప్లాన్ 84 రోజుల  చెల్లుబాటుతో వస్తుంది. రూ .499 ప్లాన్ మాదిరిగానే, ఇది కూడా ఒక సంవత్సరానికి డిస్నీ + హాట్‌స్టార్ వీఐసీ  సబ్‌స్క్రిప్షన్‌తో వస్తోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.