Skip to main content

జియో బంపర్ ఆఫర్..ఏడాదిపాటు ఉచితంగా


యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 సీజన్‌ ఆరంభమవుతుంది. రూ.499 క్రికెట్‌ ప్లాన్‌ కింద జియో తన వినియోగదారులకు రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్‌ డేటాను 56 రోజులు అందిస్తుంది. ఇది క్రికెట్‌ సీజన్‌ అయిపోయే వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో  వినియోగదారులకు ఎటువంటి కాలింగ్ లేదా ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు రావు.   మరో కొత్త ప్లాన్ రూ.399తో    డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాది పాటు లభించనుంది. 

 రూ. 777   జియో క్రికెట్ ప్లాన్ కింద, 5GB అదనపు డేటాతో 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటాను కంపెనీ  తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అపరిమిత జియో నుండి జియో కాలింగ్ ప్రయోజనాలు, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000  ఎఫ్‌యుపి నిమిషాలు, రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు అందిస్తోంది.  ఈ ప్లాన్ 84 రోజుల  చెల్లుబాటుతో వస్తుంది. రూ .499 ప్లాన్ మాదిరిగానే, ఇది కూడా ఒక సంవత్సరానికి డిస్నీ + హాట్‌స్టార్ వీఐసీ  సబ్‌స్క్రిప్షన్‌తో వస్తోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...