Skip to main content

తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన యాంకర్ ప్రదీప్

 

మిర్యాలగూడకు చెందిన ఓ అమ్మాయి హైదరాబాదులో తనపై 139 మంది అత్యాచారం చేశారని, వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారంటూ ఆరోపించడం తెలిసిందే. ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నాడంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రదీప్ స్వయంగా వివరణ ఇచ్చారు. కొన్ని యూట్యూబ్ చానళ్లలో తనపై వస్తున్న కథనాలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఎలా రాస్తారని ప్రశ్నించారు.


"వాళ్లు అనుకున్నదే నిజమని రాస్తూ, నా ఫొటోలు వాడుతూ, నా పేరు మీద హెడ్డింగులు పెడుతూ వికృత కథనాలు వెలువరిస్తున్నారు. ఎంతో సున్నితమైన అంశంలో నా పేరు ఎందుకు ఉందో అని కూడా ఆలోచించకుండా దారుణమైన రీతిలో రాసేస్తున్నారు. ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తారా? వ్యూస్ కోసం ఇష్టంవచ్చినట్టు రాసేస్తారా? ఇలాంటి వ్యూస్ దేనికి పనికొస్తాయి? నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది కదా... అప్పటివరకు ఆగలేరా?

కొన్ని చానళ్లు, కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్నదానికి నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? నాకు వినోదం అందించడం తప్ప మరేమీ తెలియదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరి అండ లేకుండా ఈస్థాయికి వచ్చాను. నాకు తెలిసింది ఒకరికి సహాయం చెయ్యడమే తప్ప, ఎవరికీ అన్యాయం చేయలేదు. నేనేం తప్పు చేశానని నాపై ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు?" అంటూ ప్రదీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రదీప్ 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.