Skip to main content

సంక్షోభానికి ముగింపు పలికిన అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్... కెమెరాలకు నవ్వుతూ పోజులు!

 


రాజస్థాన్ లో తీవ్ర రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలెట్ ఇవాళ సీఎం అశోక్ గెహ్లాట్ ను కలిశారు. రాజస్థాన్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే ప్రథమం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొనేందుకు తన ఇంటికి రావాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి సచిన్ పైలట్ కు ఆహ్వానం అందింది.

అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ లో చేసిన పోస్టు కూడా సుహృద్భావ వైఖరికి దర్పణం పట్టింది. మర్చిపోదాం, క్షమించుదాం... ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చేయి కలుపుదాం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించిందో చెప్పనక్కర్లేదు. ఇక, ఇరువురి భేటీ విషయానికొస్తే, కరోనా ప్రభావం నేపథ్యంలో మాస్కులతో హాజరయ్యారు. అనేక అంశాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఎంతో ఆప్యాయంగా పలుకరించుకుంటూ, కరచాలనం చేస్తూ, చిరునవ్వులతో ఫొటోలకు పోజులిచ్చారు. రేపటినుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  

అటు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించగా, బలం నిరూపించుకుంటామని సీఎం గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, రేపటి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను పార్టీ ఎత్తివేసింది. నెలరోజులకు పైగా సాగిన ఈ రాజకీయ సంక్షోభం సమసిపోవడంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కీలకపాత్ర పోషించారు. ఆయన కూడా ఇవాళ్టి సమావేశంలో ఎంతో హుషారుగా కనిపించారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...