Skip to main content

చైనా, రష్యా దేశాలు వ్యాక్సిన్ ను రూపొందిస్తే వాటిని తాము ఉపయోగించేది కష్టమేనంటున్న అమెరికా!

అమెరికాలో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అంటురోగాల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా దేశాలు తయారుచేస్తున్న వ్యాక్సిన్లపై ఆందోళన వ్యక్తం చేశారు.

 చైనా, రష్యా వంటి ఇతర దేశాలు రూపొందించే వ్యాక్సిన్లను అమెరికా ఉపయోగించబోదని భావిస్తున్నట్టు తెలిపారు. పాశ్చాత్య దేశాల కంటే ఆయా దేశాల్లో ఔషధ నియంత్రణ వ్యవస్థలు పారదర్శకతకు దూరంగా ఉంటాయని, ఇలాంటి దేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్ ను అమెరికా వినియోగించడం కష్టమేనని ఫౌచీ అభిప్రాయపడ్డారు. కాగా, కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా అనేక దేశీయ ఫార్మా సంస్థలకు భారీగా నిధులు గుమ్మరిస్తోంది. సనోఫీ, జీఎస్కే వంటి దిగ్గజ ఫార్మాసంస్థలకు 2.1 బిలియన్ డాలర్లు అందిస్తోంది.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...