Skip to main content

కరోనా నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్

 బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'కౌన్‌ బనేగా కరోర్‌పతి' 12వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొన్నానని ఆయన చెప్పారు.


షూటింగ్ సందర్భంగా అక్కడి సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించి ఉండడం ఇందులో కనపడుతోంది. బ్యాక్‌ టు వర్క్‌.. కేబీసీ 12వ సీజన్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ పీపీఈ కిట్లు ధరించి షూటింగ్‌లో పాల్గొంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది శుభపరిణామమని, కేబీసీ ప్రారంభమై ఈ ఏడాదితో 20 ఏళ్లు గడుస్తున్నాయని చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.