Skip to main content

కరోనా నుంచి కోలుకుని షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్

 బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి ఇటీవలే డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. 'కౌన్‌ బనేగా కరోర్‌పతి' 12వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొన్నానని ఆయన చెప్పారు.


షూటింగ్ సందర్భంగా అక్కడి సిబ్బంది అందరూ పీపీఈ కిట్లు ధరించి ఉండడం ఇందులో కనపడుతోంది. బ్యాక్‌ టు వర్క్‌.. కేబీసీ 12వ సీజన్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ పీపీఈ కిట్లు ధరించి షూటింగ్‌లో పాల్గొంది అంటూ ఆయన పేర్కొన్నారు. ఇది శుభపరిణామమని, కేబీసీ ప్రారంభమై ఈ ఏడాదితో 20 ఏళ్లు గడుస్తున్నాయని చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.