Skip to main content

ఇది చరిత్రాత్మకమైన రోజు, ప్రధాని మోదీ



రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన ఈ రోజు చరిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవలసిన అవసరం ఉందని, నేడు తానిక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన  చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన స్థలంలో వెండి ఇటుకను వేసి భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడిన ఆయన.. భారత దేశమంతా నేడు రామజపాన్ని స్మరిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడికి చేరుకున్న భక్తులందరినీ మోదీ అభినందించారు.’ దశాబ్దాల కల నెరేవేరింది. రాముడి ఔన్నత్యాన్ని భారతీయులందరూ అలవరచుకోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహత్తర  క్షణం కోసం తాను, ఈ దేశం ఎన్నేళ్లుగానో వేచి చూసినట్టు ఆయన చెప్పారు.

రాముడు మన అందరిలో ఉన్నాడని, మన సంస్కృతికి రాముడే ఆధారమని మోదీ పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణం చరిత్రాత్మకమైనదే కాదు.. చరిత్ర పునరావృతమవుతుందని తెలిపే రోజిది.. దేశంలోని కోట్లాది భక్తుల కల నెరవేరబోతోంది అని ఆయన అన్నారు. సత్యం, అహింస, శాంతి, విశ్వాసం, త్యాగనిరతికి పెట్టింది పేరయిన  ఈ దేశం ధర్మాన్ని ప్రబోధిస్తుందంటే అది రాముడి చలవే అని ఆయన వ్యాఖ్యానించారు. రాముడు విశ్వజనీనుడని, కబీర్ దాస్, నానక్ ల ప్రబోధాలకు స్ఫూర్తినిచ్చాడని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కి రాముడు ప్రతీక అని అభివర్ణించారు. ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం నమ్మశక్యం కాని ఘటన అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.   . 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...