Skip to main content

అన్న‌య్య త్వ‌ర‌గా కోలుకుని రండి, మీకోసం ఎదురు చూస్తున్నాః క‌మ‌ల్

 


సీనియ‌ర్‌ సింగ‌ర్ ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యం ఆరోగ్య ప‌రిస్థితిపై స్పందించారు.. ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌. ఈ మేర‌కు ఆయ‌న‌కు సంబంధించి క‌మ‌ల్ హాస‌న్‌ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ”ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య త్వరగా కోలుకోని రండి, మీకోసం ఎదురుచూస్తు నాను. నా సినీ జీవితంలో ఎన్నో సినిమాలకు మీ గాత్రం ద్వారా వన్నె తెచ్చారు. నా గొంతులో మీ స్వరం కలిసిపోయింది. అన్నయ్య మీరు మరిన్ని చిత్రాలకు పాటలు పాడాలని కోరుకుంటున్నాను” అంటూ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు క‌మ‌ల్ హాస‌న్‌.

కాగా ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ చేశారు ఎంజీఎం ఆస్పత్రి డాక్ట‌ర్లు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో లైఫ్ స‌పోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కంటే ప్ర‌స్తుతం ఆయ‌న‌ ప‌రిస్థితి కాస్త మెరుగ్గా ఉందని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఆయ‌న‌ కుమారుడు ఎస్పీ చరణ్ సూచించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.