Skip to main content

ఆహా యాప్‌లో విడుద‌ల కానున్న‌ జ్యోతిక ‘మ‌గువ‌లు మాత్ర‌మే’



కరోనా వైరస్ కారణంగా ప్ర‌స్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ పెరిగింది. కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్లు కూడా ఓపెన్ కాక‌పోవ‌డంతో.. ద‌ర్శ‌క నిర్మాత‌లంద‌రూ ఓటీటీ వేదిక‌ల‌గానే త‌మ సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా చిత్రాల‌ను కూడా రిలీజ్ చేశారు. అందులోనూ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రాముఖ్యత పెరిగింది. సినిమాలతో పాటు వీటికి కూడా మంచి డిమాండ్ వస్తూండటంతో టాప్ సెలబ్రిటీలు కూడా ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. కాగా ఇక ఈ మ‌ధ్యే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లోకి వ‌చ్చిన ‘ఆహా యాప్’ కూడా మంచి స్పంద‌న లభిస్తుంది.

తాజాగా మ‌రో కొత్త సినిమా ఆహా యాప్‌లో రిలీజ్ కాబోతుంది. ప్ర‌ముఖ న‌టి జ్యోతిక న‌టించిన ‘మ‌గువ‌లు మాత్ర‌మే’ అనే చిత్రం ఆగ‌ష్టు 7వ తేదీన‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా యాప్‌లో విడుద‌ల కాబోతంది. ఇటీవ‌లే జ్యోతిక ప్ర‌ముఖ పాత్ర‌లో న‌టించిన ’36 వ‌య‌సులో’ సినిమా కూడా ఆహాలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌గువ‌లు మాత్ర‌మే మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఊర్వ‌శి, నాజ‌ర్‌, భాను ప్రియ‌, మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కాగా ఈ సినిమాకు గిబ్ర‌న్ సంగీతం అందించారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.