Skip to main content

బ‌ర్త్‌డే కేకులో డ‌బ్బులే డ‌బ్బులు...



వీడియో చూడండి:https://youtu.be/mGya-ylHNA0

పుట్టిన‌రోజు అంటేనే కేక్ క‌టింగ్‌, ఈ తంతు ముగియ‌గానే ఇష్ట‌మైన వారు కానుక‌లు స‌మ‌ర్పించుకుంటారు. అయితే ఈ రెండూ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇక్క‌డ చెప్పిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఓ తండ్రి  పుట్టినరోజు సెల‌బ్రేష‌న్స్ కోసం అత‌ని కుటుంబం కేక్ సిద్ధం చేసింది. అయితే కేక్ క‌ట్ చేయ‌నివ్వ‌లేదు. ఎందుకంటే ఆ కేక్‌లోనే అస‌లు సిస‌లైన గిఫ్ట్ ఉంది. దీంతో కేక్ పైన ఉన్న హ్యాపీ బ‌ర్త్‌డే టాప‌ర్‌ను బ‌య‌ట‌కు తీస్తుండ‌గా దాని చివ‌ర‌న‌ నోట్ల క‌ట్ట‌లు క‌నిపించాయి. లాగుతూ ఉన్నంత సేపు అవి వ‌స్తూనే ఉన్నాయి. ఆ డాల‌ర్ల కట్ట‌లు కేకులో త‌డ‌వ‌కుండా ఉండేందుకు ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో పెట్టారు. ఇక ఈ నోట్ల క‌ట్ట‌ల‌ను తీస్తున్న ఆ తండ్రి ఆనందం చెప్ప‌న‌ల‌వి కాదు. చిన్న‌పిల్లాడిలా గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

"నాకు తెలుసు, మీరు న‌న్ను త‌ప్ప‌కుండా సంతోష‌పెడ్తార‌ని.." అంటూ ఏకంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే అత‌ను నోట్లు లాగే క్ర‌మంలో కేక్ ఏమాత్రం దిబ్బ‌తిన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియోను అత‌ని కూతురు టోనీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. "ఈ రోజు నాన్న‌గారి పుట్టిన రోజు. ప్ర‌తి బ‌ర్త్‌డేకు ఆయ‌న ఒక్క‌టే కోరుకుంటారు. అదే డబ్బు. అందుకే ప్ర‌తి ఏడాది ఆయ‌న్ను అదే డ‌బ్బుల‌తో ఎన్నోర‌కాలుగా స‌ర్‌ప్రైజ్ చేసేందుకు నా సోద‌రి, త‌ల్లి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు" అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. "కేకులో అంత డ‌బ్బు ఎలా పెట్టారో'న‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అత‌ని ఆనందాన్ని చూసి భావోద్వేగానికి లోన‌వుతూ.. 'నేను కూడా మా నాన్న‌కు ఏది కావాలో తెలుసుకుని త‌ప్ప‌కుండా ఇస్తాను" అంటున్నారు.


Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...