Skip to main content

బ‌ర్త్‌డే కేకులో డ‌బ్బులే డ‌బ్బులు...



వీడియో చూడండి:https://youtu.be/mGya-ylHNA0

పుట్టిన‌రోజు అంటేనే కేక్ క‌టింగ్‌, ఈ తంతు ముగియ‌గానే ఇష్ట‌మైన వారు కానుక‌లు స‌మ‌ర్పించుకుంటారు. అయితే ఈ రెండూ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇక్క‌డ చెప్పిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఓ తండ్రి  పుట్టినరోజు సెల‌బ్రేష‌న్స్ కోసం అత‌ని కుటుంబం కేక్ సిద్ధం చేసింది. అయితే కేక్ క‌ట్ చేయ‌నివ్వ‌లేదు. ఎందుకంటే ఆ కేక్‌లోనే అస‌లు సిస‌లైన గిఫ్ట్ ఉంది. దీంతో కేక్ పైన ఉన్న హ్యాపీ బ‌ర్త్‌డే టాప‌ర్‌ను బ‌య‌ట‌కు తీస్తుండ‌గా దాని చివ‌ర‌న‌ నోట్ల క‌ట్ట‌లు క‌నిపించాయి. లాగుతూ ఉన్నంత సేపు అవి వ‌స్తూనే ఉన్నాయి. ఆ డాల‌ర్ల కట్ట‌లు కేకులో త‌డ‌వ‌కుండా ఉండేందుకు ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో పెట్టారు. ఇక ఈ నోట్ల క‌ట్ట‌ల‌ను తీస్తున్న ఆ తండ్రి ఆనందం చెప్ప‌న‌ల‌వి కాదు. చిన్న‌పిల్లాడిలా గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

"నాకు తెలుసు, మీరు న‌న్ను త‌ప్ప‌కుండా సంతోష‌పెడ్తార‌ని.." అంటూ ఏకంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే అత‌ను నోట్లు లాగే క్ర‌మంలో కేక్ ఏమాత్రం దిబ్బ‌తిన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియోను అత‌ని కూతురు టోనీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. "ఈ రోజు నాన్న‌గారి పుట్టిన రోజు. ప్ర‌తి బ‌ర్త్‌డేకు ఆయ‌న ఒక్క‌టే కోరుకుంటారు. అదే డబ్బు. అందుకే ప్ర‌తి ఏడాది ఆయ‌న్ను అదే డ‌బ్బుల‌తో ఎన్నోర‌కాలుగా స‌ర్‌ప్రైజ్ చేసేందుకు నా సోద‌రి, త‌ల్లి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు" అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. "కేకులో అంత డ‌బ్బు ఎలా పెట్టారో'న‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అత‌ని ఆనందాన్ని చూసి భావోద్వేగానికి లోన‌వుతూ.. 'నేను కూడా మా నాన్న‌కు ఏది కావాలో తెలుసుకుని త‌ప్ప‌కుండా ఇస్తాను" అంటున్నారు.


Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...