Skip to main content

బ‌ర్త్‌డే కేకులో డ‌బ్బులే డ‌బ్బులు...



వీడియో చూడండి:https://youtu.be/mGya-ylHNA0

పుట్టిన‌రోజు అంటేనే కేక్ క‌టింగ్‌, ఈ తంతు ముగియ‌గానే ఇష్ట‌మైన వారు కానుక‌లు స‌మ‌ర్పించుకుంటారు. అయితే ఈ రెండూ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇక్క‌డ చెప్పిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఓ తండ్రి  పుట్టినరోజు సెల‌బ్రేష‌న్స్ కోసం అత‌ని కుటుంబం కేక్ సిద్ధం చేసింది. అయితే కేక్ క‌ట్ చేయ‌నివ్వ‌లేదు. ఎందుకంటే ఆ కేక్‌లోనే అస‌లు సిస‌లైన గిఫ్ట్ ఉంది. దీంతో కేక్ పైన ఉన్న హ్యాపీ బ‌ర్త్‌డే టాప‌ర్‌ను బ‌య‌ట‌కు తీస్తుండ‌గా దాని చివ‌ర‌న‌ నోట్ల క‌ట్ట‌లు క‌నిపించాయి. లాగుతూ ఉన్నంత సేపు అవి వ‌స్తూనే ఉన్నాయి. ఆ డాల‌ర్ల కట్ట‌లు కేకులో త‌డ‌వ‌కుండా ఉండేందుకు ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో పెట్టారు. ఇక ఈ నోట్ల క‌ట్ట‌ల‌ను తీస్తున్న ఆ తండ్రి ఆనందం చెప్ప‌న‌ల‌వి కాదు. చిన్న‌పిల్లాడిలా గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

"నాకు తెలుసు, మీరు న‌న్ను త‌ప్ప‌కుండా సంతోష‌పెడ్తార‌ని.." అంటూ ఏకంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే అత‌ను నోట్లు లాగే క్ర‌మంలో కేక్ ఏమాత్రం దిబ్బ‌తిన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియోను అత‌ని కూతురు టోనీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. "ఈ రోజు నాన్న‌గారి పుట్టిన రోజు. ప్ర‌తి బ‌ర్త్‌డేకు ఆయ‌న ఒక్క‌టే కోరుకుంటారు. అదే డబ్బు. అందుకే ప్ర‌తి ఏడాది ఆయ‌న్ను అదే డ‌బ్బుల‌తో ఎన్నోర‌కాలుగా స‌ర్‌ప్రైజ్ చేసేందుకు నా సోద‌రి, త‌ల్లి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు" అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. "కేకులో అంత డ‌బ్బు ఎలా పెట్టారో'న‌ని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు అత‌ని ఆనందాన్ని చూసి భావోద్వేగానికి లోన‌వుతూ.. 'నేను కూడా మా నాన్న‌కు ఏది కావాలో తెలుసుకుని త‌ప్ప‌కుండా ఇస్తాను" అంటున్నారు.


Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...