Skip to main content

హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసిన కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ ట్రయల్స్!

 


హైదరాబాద్ లోని నిమ్స్ (నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు మొత్తం 60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన నిమ్స్ బృందం, వారిలో 50 మందిని ఎంచుకుని వ్యాక్సిన్ టీకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి డోస్ ఇచ్చిన 14 రోజుల తరువాత అదే కోడ్ కు చెందిన బూస్టర్ డోస్ ను ఇచ్చామని, ఆ ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు.


నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్ నేతృత్వంలోని క్లినికల్ ఫార్మకాలజీ విభాగం, పలువురు ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులతో పాటు రెస్పిరేటరీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ విభాగాల డాక్టర్లు ఈ ట్రయల్స్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లందరూ ప్రస్తుతం తమతమ ఇళ్లలోనే ఉండగా, వారందరినీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇక 28 రోజుల తరువాత రెండవ మోతాదు టీకాను ఇచ్చేందుకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ విభాగం అధికారి డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న వారి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, వారికి రెండవ మోతాదు టీకా ఇచ్చే విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు. కాగా, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా పలు చోట్ల పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల నుంచి తొలి దశ ట్రయల్స్ విజయవంతం అయినట్టు తెలుస్తుండటంతో, రెండో దశను ప్రారంభించనున్నారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...