Skip to main content

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌కు క‌రోనా పాజిటివ్



ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్‌, బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తికి క‌రోనా వైర‌స్ సోకింది. ఆయ‌న ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించారు. కోన ర‌ఘుప‌తితో పాటు భార్య‌, కుమార్తెకు కూడా కోవిడ్ నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి. వీడియోలో స్పీక‌ర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు జ్వ‌రం రావ‌డంతో క‌రోనా టెస్టులు చేయించాం. రిపోర్టులో పాజిటివ్ వ‌చ్చింది. దీనికి కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని వైద్యులు సూచించిన‌ట్లు చెప్పారు. దీంతో నేను ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేస్తున్నాను. నేను ప్ర‌స్తుతం ధైర్యంగా ఉన్నాను. కేవ‌లం మాకు మైల్డ్ ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయి. కాబ‌ట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వారం రోజుల్లోనే మ‌ళ్లీ క‌లుద్దాం’. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.