Skip to main content

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌కు క‌రోనా పాజిటివ్



ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్‌, బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తికి క‌రోనా వైర‌స్ సోకింది. ఆయ‌న ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించారు. కోన ర‌ఘుప‌తితో పాటు భార్య‌, కుమార్తెకు కూడా కోవిడ్ నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి. వీడియోలో స్పీక‌ర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు జ్వ‌రం రావ‌డంతో క‌రోనా టెస్టులు చేయించాం. రిపోర్టులో పాజిటివ్ వ‌చ్చింది. దీనికి కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని వైద్యులు సూచించిన‌ట్లు చెప్పారు. దీంతో నేను ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేస్తున్నాను. నేను ప్ర‌స్తుతం ధైర్యంగా ఉన్నాను. కేవ‌లం మాకు మైల్డ్ ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయి. కాబ‌ట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వారం రోజుల్లోనే మ‌ళ్లీ క‌లుద్దాం’. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...