Skip to main content

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌కు క‌రోనా పాజిటివ్



ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్‌, బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తికి క‌రోనా వైర‌స్ సోకింది. ఆయ‌న ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించారు. కోన ర‌ఘుప‌తితో పాటు భార్య‌, కుమార్తెకు కూడా కోవిడ్ నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి. వీడియోలో స్పీక‌ర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు జ్వ‌రం రావ‌డంతో క‌రోనా టెస్టులు చేయించాం. రిపోర్టులో పాజిటివ్ వ‌చ్చింది. దీనికి కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని వైద్యులు సూచించిన‌ట్లు చెప్పారు. దీంతో నేను ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేస్తున్నాను. నేను ప్ర‌స్తుతం ధైర్యంగా ఉన్నాను. కేవ‌లం మాకు మైల్డ్ ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయి. కాబ‌ట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వారం రోజుల్లోనే మ‌ళ్లీ క‌లుద్దాం’. అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...