Skip to main content

అమ‌రావ‌తి రైతుల త‌ర‌పున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన చీఫ్ జస్టిస్ కుమార్తె

 ఏపీ మూడు రాజధానుల అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. 


అమరావతి రైతుల తరపున సీజేఐ బాబ్డే కుమార్తె రుక్మిణి బాబ్డే వాదనలు వినిపించారు. దీంతో, ఈ కేసును ఇతర బెంచ్ కు బదిలీ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా, గత వారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...