Skip to main content

సాఫ్ట్‌వేర్ శారద’కు టిటా చేయూత.. ఏఐపై ఉచిత శిక్షణ




కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయల వ్యాపారం చేస్తున్న ‘సాఫ్ట్‌వేర్ శారద’కు  తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) చేయూత అందించేందుకు ముందుకొచ్చింది. శనివారం ఆమెకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందించిన టిటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆమెకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.

ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో ఉచితంగా శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను ఆమెకు అందించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఓ సంస్థలో పనిచేసిన శారద.. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం కోల్పోయినందుకు ఏమాత్రం దిగులు చెందకుండా కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన ఆమె తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.  

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.