Skip to main content

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్..

 


కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు వెల్లడైంది. ఓబుళాపురం మైనింగ్ స్కాంలో గత ఐదేళ్లుగా గాలి కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారు.

అయితే ఇటీవలే కర్ణాటక ఆరోగ్యమంత్రి బి.శ్రీరాములుకు మాతృవియోగం కలిగింది. తన సన్నిహితుడైన శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గాను... గాలి సుప్రీం కోర్టును అభ్యర్థించి బళ్లారి వెళ్లేందుకు రెండ్రోజుల ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, తనకు కరోనా సోకిందని, బళ్లారి వెళ్లలేకపోతున్నానని గాలి సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా, లక్షణాలు ఏవీ లేకపోవడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.