Skip to main content

దారి తప్పి మోహన్ బాబు ఇంటి కి వచ్చారన్న యువకుల తల్లిదండ్రులు

నిన్న రాత్రి హైదరాబాద్‌, జల్‌పల్లిలో సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి నలుగురు యువకులు కారుతో దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారు మోహన్‌బాబు కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మైలార్‌దేవ్‌పల్లి ‌కు చెందిన నలుగురు యువకులను గుర్తించిన పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు. వారి పేర్లు రాఘవేంద్ర, ఆనంద్, గౌతమ్, డేవిడ్‌గా గుర్తించారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ యువకుల తల్లిదండ్రులు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరారు . ఫాంహౌస్‌ చూడడానికే తమ పిల్లలు అక్కడికి వెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంతేగానీ, దానిపై దాడి చేయడానికి వెళ్లలేదని వారు వివరించారు. అయితే, వారు దారి తప్పి మోహన్‌బాబు ఫాంహౌస్‌కి వెళ్లి ఉండొచ్చని కూడా వారు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివిరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.