Skip to main content

టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుమలఅన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్సారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి అధిక స్థాయిలో ఉందని.. ఈ పరిస్థితుల్లో స్వామివారి వాహన సేవలు మాఢవీధుల్లో నిర్వహించే పరిస్థతి లేదన్నారు. బ్రహోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. అధిక మాసం కారణంగా రెండు సార్లు బ్రహోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే.. యథాతధంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

టీటీడీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..

విజయవాడ సమీపంలోని పోరంకిలో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించడానికి అంగీకరించారు. తిరుమలలోని చెత్తను కంపోస్ట్‌గా మార్చి రైతులకు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. కొండ మీద టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని దాన్ని వెంటనే తరలించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రతీ నెల డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకులో డిపాజిట్‌ చెయ్యాలని నిర్ణయించింది టీటీడీ. ఎక్కువ శాతం వడ్డీ రావడానికి బంగారం డిపాజిట్‌ 5 సంవత్సరాలకు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా పాత నోట్లు వస్తున్నాయని అధికారులు చెప్పారు. అయితే వీటిని మార్పిడికి చేయడానికి ఆర్‌బీఐతో సంప్రదింపులు చేయాలని కూడా టీటీడీ నిర్ణయించింది. బర్డ్‌ ఆస్పత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5కోట్లు మంజూరు. గో సంరక్షణకు అధిక ప్రాధానం. ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని నిర్ణయాన్ని సమావేశంలో చర్చించారు. ఆవు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్‌ తెలిపారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...