ఏపీలో కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా కలవరపెడుతోంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరోనా బారిన పడ్డారు. .. తాజాగా విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ కు కరోనా సోకింది.గత కొద్దిరోజులుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది . దీంతో ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారాని తెలిపారు
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment