Skip to main content

అమరావతి రైతులకు శుభవార్త..! వంద‌శాతం అమరావతే రాజ‌ధాని..!


వంద‌శాతం రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రాలేద‌ని గుర్తుచేశారు. అమరావతి రైతులకు శుభవార్త.. రేపు రాష్ట్ర హైకోర్టు దీనిపై తీర్పు వెల్ల‌డించ‌నుంద‌న్న ఆయ‌న‌.. ఇక‌, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు. రాజ్యాంగం రైతులకు అనుకూలంగా ఉంది.. రైతుల వైపు న్యాయం ఉంటుంది.. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే మాట్లడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతీఒక్కరి భాధ్యత అన్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. రాష్ట్రానికి అమరావతి మాత్రమే వందశాతం రాజధానిగా ఉంటుందనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. 

ఇక‌, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి.. వైఎస్సార్ పార్టీ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భాధ్యత మరిచి నా పై పిచ్చి ప్రకటనలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. దేవేంద్ర రెడ్డి తను ప్రేమించే వాళ్లకంటే నేను అందంగా ఉండడం తట్టుకోలేక పిచ్చి ప్రకటనలు చేస్తున్నార‌ని.. “రాజుగారి విగ్గు” ఊడినట్లేనా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. దేశంలో ఉన్న పదవులన్ని విజయసాయిరెడ్డికే కావాలంటూ సెటైర్లు వేసిన‌ రామ‌కృష్ణంరాజు... పార్టీకి ప్రభుత్వానికి తేడా ఉందా? లేదా సీఎం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో అన్ని పదవులు రెడ్డి కులస్తులేకేనా? అని ప్రశ్నించిన ఆయ‌న‌.. ఛైర్మన్ పోస్ట్ రెడ్డి కులస్తులకు, ప్యూన్ పోస్ట్ ఎస్సీకో, బీసీకో ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి రేటు మైనస్ స్థాయికి పడిపోవడం ఆందోళనకరం అన్నారు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...