Skip to main content

అమరావతి రైతులకు శుభవార్త..! వంద‌శాతం అమరావతే రాజ‌ధాని..!


వంద‌శాతం రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రాలేద‌ని గుర్తుచేశారు. అమరావతి రైతులకు శుభవార్త.. రేపు రాష్ట్ర హైకోర్టు దీనిపై తీర్పు వెల్ల‌డించ‌నుంద‌న్న ఆయ‌న‌.. ఇక‌, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌న్నారు. రాజ్యాంగం రైతులకు అనుకూలంగా ఉంది.. రైతుల వైపు న్యాయం ఉంటుంది.. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంటే మాట్లడడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతీఒక్కరి భాధ్యత అన్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. రాష్ట్రానికి అమరావతి మాత్రమే వందశాతం రాజధానిగా ఉంటుందనే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. 

ఇక‌, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి.. వైఎస్సార్ పార్టీ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భాధ్యత మరిచి నా పై పిచ్చి ప్రకటనలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. దేవేంద్ర రెడ్డి తను ప్రేమించే వాళ్లకంటే నేను అందంగా ఉండడం తట్టుకోలేక పిచ్చి ప్రకటనలు చేస్తున్నార‌ని.. “రాజుగారి విగ్గు” ఊడినట్లేనా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు.. దేశంలో ఉన్న పదవులన్ని విజయసాయిరెడ్డికే కావాలంటూ సెటైర్లు వేసిన‌ రామ‌కృష్ణంరాజు... పార్టీకి ప్రభుత్వానికి తేడా ఉందా? లేదా సీఎం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో అన్ని పదవులు రెడ్డి కులస్తులేకేనా? అని ప్రశ్నించిన ఆయ‌న‌.. ఛైర్మన్ పోస్ట్ రెడ్డి కులస్తులకు, ప్యూన్ పోస్ట్ ఎస్సీకో, బీసీకో ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి రేటు మైనస్ స్థాయికి పడిపోవడం ఆందోళనకరం అన్నారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...