Skip to main content

మరొక్క నాలుగు నెలలు... వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ!

 


కరోనా వైరస్ కు విరుగుడుగా డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వ్యాఖ్యానించారు. వాల్యూముల పరంగా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలను తయారు చేస్తున్న సంస్థగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనున్నదని 'సీఎన్బీసీ టీవీ 18'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ లో తమ సంస్థ వ్యాక్సిన్ ను విడుదల చేస్తుందని తెలిపారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ తయారీ ప్రారంభమవుతుందని, రెండు వారాల్లోనే ఐసీఎంఆర్ తో కలిసి తాము ట్రయల్స్ చేపడుతామని తెలిపారు.


కాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, వ్యాక్సిన్ అలయన్స్ గావిలతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేసి, వాటిని ఇండియాతో పాటు ఇతర అల్పాదాయ దేశాలకు అందించాలని నిర్ణయించినట్టు అదార్ పూనావాలా తెలిపారు. ఇందుకోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్లను రిస్క్ ఫండింగ్ గా అందించింది కూడా.

ఈ నిధులతోనే సీరమ్, ఆస్ట్రాజెనికా, నోవావాక్స్ సిద్ధం చేసిన వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయనుంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ మూడవ దశలోకి ప్రవేశించగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తే మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే సీరమ్, తాను తయారు చేసిన డోస్ లను మార్కెట్లోకి పంపాల్సి వుంటుంది. వ్యాక్సిన్ ధర 3 డాలర్ల వరకూ ఉంటుందని వెల్లడించిన ఆయన, తుది ధరను రెండు నెలల్లోగా ఖరారు చేస్తామని అదార్ పూనావాలా తెలియజేశారు.  

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...