Skip to main content

మరొక్క నాలుగు నెలలు... వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ!

 


కరోనా వైరస్ కు విరుగుడుగా డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వ్యాఖ్యానించారు. వాల్యూముల పరంగా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలను తయారు చేస్తున్న సంస్థగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనున్నదని 'సీఎన్బీసీ టీవీ 18'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ లో తమ సంస్థ వ్యాక్సిన్ ను విడుదల చేస్తుందని తెలిపారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ తయారీ ప్రారంభమవుతుందని, రెండు వారాల్లోనే ఐసీఎంఆర్ తో కలిసి తాము ట్రయల్స్ చేపడుతామని తెలిపారు.


కాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, వ్యాక్సిన్ అలయన్స్ గావిలతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేసి, వాటిని ఇండియాతో పాటు ఇతర అల్పాదాయ దేశాలకు అందించాలని నిర్ణయించినట్టు అదార్ పూనావాలా తెలిపారు. ఇందుకోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్లను రిస్క్ ఫండింగ్ గా అందించింది కూడా.

ఈ నిధులతోనే సీరమ్, ఆస్ట్రాజెనికా, నోవావాక్స్ సిద్ధం చేసిన వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేయనుంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ మూడవ దశలోకి ప్రవేశించగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తే మార్కెట్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే సీరమ్, తాను తయారు చేసిన డోస్ లను మార్కెట్లోకి పంపాల్సి వుంటుంది. వ్యాక్సిన్ ధర 3 డాలర్ల వరకూ ఉంటుందని వెల్లడించిన ఆయన, తుది ధరను రెండు నెలల్లోగా ఖరారు చేస్తామని అదార్ పూనావాలా తెలియజేశారు.  

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.