Skip to main content

గుడ్‌న్యూస్‌... భారీగా ప‌డిపోయిన ప‌సిడి ధ‌ర‌



వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుడు అందుకోనంత ఎత్తుకు దూసుకెళ్లిన బంగారం ధ‌ర క్ర‌మంగా కింద‌కు దిగుతోంది. ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన ప‌డిసి ధ‌ర‌.. నాలుగు రోజులుగా ప‌డిపోతోంది... నిన్నటి వ‌ర‌కు వంద‌ల్లో త‌గ్గ‌గా.. ఇవాళ ఏకంగా వేల‌ల్లో ప‌డిపోయింది. పసిడి ప్రేమికులకు శుభార్త చెబుతూ రూ.3వేల‌కు పైగా త‌గ్గింది. హైద‌రాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించి రూ.54,680కి ప‌డిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 ప‌డిపోయివ‌డంతో రూ.50,130కు దిగివ‌చ్చింది. అయితే, ప‌సిడి ధ‌ర ప‌డిపోయినా వెండి కాస్త పైకి క‌దిలింది.. రూ.50 పెర‌గ‌డంతో.. కిలో వెండి ధ‌ర రూ.72,550కు చేరింది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ప్ర‌భావం దేశీ మార్కెట్ల‌పై స్ప‌ష్టంగా చూపిస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1944 డాలర్లకు దిగివ‌చ్చింది.. ఇక‌, కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ధ‌ర ప‌డిపోయినా చాలా ప్ర‌భావాన్ని చూపించ‌నుంది.. బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ పై స్ప‌ష్టంగా క‌నిపించ‌నుంది. వ‌రుస‌గా బంగారం ధ‌ర పెర‌గ‌డంతో.. బంగారంపై ఇచ్చే రుణ ప‌రిమితిని పెంచుతూ వ‌చ్చాయి బ్యాంకులు.. వాటిపై కూడా ఈ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేష‌కులు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...