Skip to main content

గుడ్‌న్యూస్‌... భారీగా ప‌డిపోయిన ప‌సిడి ధ‌ర‌



వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుడు అందుకోనంత ఎత్తుకు దూసుకెళ్లిన బంగారం ధ‌ర క్ర‌మంగా కింద‌కు దిగుతోంది. ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన ప‌డిసి ధ‌ర‌.. నాలుగు రోజులుగా ప‌డిపోతోంది... నిన్నటి వ‌ర‌కు వంద‌ల్లో త‌గ్గ‌గా.. ఇవాళ ఏకంగా వేల‌ల్లో ప‌డిపోయింది. పసిడి ప్రేమికులకు శుభార్త చెబుతూ రూ.3వేల‌కు పైగా త‌గ్గింది. హైద‌రాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3350 క్షీణించి రూ.54,680కి ప‌డిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 ప‌డిపోయివ‌డంతో రూ.50,130కు దిగివ‌చ్చింది. అయితే, ప‌సిడి ధ‌ర ప‌డిపోయినా వెండి కాస్త పైకి క‌దిలింది.. రూ.50 పెర‌గ‌డంతో.. కిలో వెండి ధ‌ర రూ.72,550కు చేరింది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల ప్ర‌భావం దేశీ మార్కెట్ల‌పై స్ప‌ష్టంగా చూపిస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1944 డాలర్లకు దిగివ‌చ్చింది.. ఇక‌, కొత్త రికార్డులు సృష్టించిన బంగారం ధ‌ర ప‌డిపోయినా చాలా ప్ర‌భావాన్ని చూపించ‌నుంది.. బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ పై స్ప‌ష్టంగా క‌నిపించ‌నుంది. వ‌రుస‌గా బంగారం ధ‌ర పెర‌గ‌డంతో.. బంగారంపై ఇచ్చే రుణ ప‌రిమితిని పెంచుతూ వ‌చ్చాయి బ్యాంకులు.. వాటిపై కూడా ఈ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేష‌కులు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...