Skip to main content

చంద్రబాబూ, విజయవాడ ప్రమాద ఘటనపై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలి?: నిలదీసిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

 


చంద్రబాబు నిర్వహించే జూమ్ యాప్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనే రమేశ్ చౌదరి నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.


 విజయవాడలో నిన్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించడం తెలిసిందే. ఈ హోటల్ ను స్థానిక రమేశ్ హాస్పిటల్ కొవిడ్ కేర్ సెంటర్ గా ఉపయోగించుకుంటోంది. ఈ హాస్పిటల్ అధినేత రమేశ్ చౌదరి విషయంలో చంద్రబాబు మౌనం వెనుక అర్థం ఏమిటని శ్రీకాంత్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ప్రతిదానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు... రమేశ్ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.

"మీ పార్టీకి సంబంధించిన వాళ్లు చేస్తే ఒకరకంగా, ఇతరులు చేస్తే ఒకరకంగా స్పందించడం మీ నైజం... మీ నైజాన్ని బయటపెట్టేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఓ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసే వ్యక్తి ఇలా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు. అందరికీ అతీతంగా వ్యవహరించినప్పుడే మనం నాయకులం అవుతాం. అలాంటి ఉద్దేశం నీకే కోశానా లేదు. నీకు తెలిసిందల్లా ప్రతిదానికీ కుల రాజకీయాలు చేయడమే! తప్పు చేసిన వాళ్లను శిక్షించినా కుల ప్రస్తావన తీసుకువస్తావు. స్వయానా నీ పార్టీ వాళ్లే బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీలపైన దాడిచేసినా అందుకు ప్రభుత్వానిదే తప్పంటావు. ఈ రెండు నాల్కల ధోరణి మానుకోవాలి.

అమరావతి విషయంలోనూ అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. మేమెప్పుడూ అమరావతికి అన్యాయం చేయాలని భావించలేదు. అమరావతిని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం. అమరావతితో పాటు వికేంద్రీకరణ కూడా మాకు ముఖ్యమని చెబుతున్నాం. రాష్ట్ర నడిబొడ్డున జరిగిన విజయవాడ అగ్నిప్రమాదంపై మాత్రం ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తున్నాం. ఈ ఘటనలో ఫలానా వ్యక్తులది తప్పు అని ఎందుకు నీ నోట్లోంచి ఒక్క మాటా కూడా రావడం లేదని అడుగుతున్నాం.

కానీ చంద్రబాబు గారూ, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ ఉద్దేశాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. మీకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదని భావించి, ఆ జూమ్ యాప్ ద్వారా లేనిపోనివి ఏదో ఒకటి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మిమ్మల్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఎవరైనా గానీ తప్పు చేసినవాడికి శిక్ష పడాలన్నదే మా ప్రభుత్వ నైజం. విజయవాడ ఘటనపై కమిటీ వేయడమే కాకుండా ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలు కూడా ప్రకటించాం. కమిటీ నివేదిక వచ్చాక కారకులపై కఠినచర్యలు తీసుకుంటాం" అని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.