Skip to main content

నేటి ట్వీట్లు

ధోని రిటైర్మెంట్ పై మహేష్ ట్వీట్...ఎలా మరచిపోగలం అంటూ


వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన మహీ... రీఎంట్రీపై వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఉహించని విధంగా షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు ధోని. ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యావాదాలు అంటూ తెలుపుతూనే..ఆదివారం రాత్రి 7 గంటల 29 నిమిషాల నుంచి రిటైర్ అయినట్లుగా భావించాలని తన కామెంట్‌లో పోస్టు చేశాడు ధోని. అయితే.. ధోని రిటైర్మెంట్ పై ప్రిన్స్ మహేష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు అంటూ మహేష్ ట్వీట్ చేశారు.


 

 



కంగ్రాచ్యులేషన్స్ ధోనీ..సీఎం జగన్ ట్వీట్

టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో దోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు ధోని రిటైర్మెంట్ తో కలత చెందుతున్నారు. ఇకపై ధోనిని ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూడలేమని ఆవేదన చెందుతున్నారు. ఇక తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో ధోనికి అభినందనలు తెలిపారు. "నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు ధోని. మీరు వదిలివేస్తున్న వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాబోయే తరాల క్రికెట్  ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు." అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 


Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...