జులై 29 వ తేదీన ఇండియాకు ఫ్రాన్స్ నుంచి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. యుద్ధ విమానాలు ఇండియాకు రావడంతో మన రక్షణ వ్యవస్థ మరింత పెరిగింది. అయితే, ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇండియా చైనా బోర్డర్ లో రాత్రి సమయంలో నిఘా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విమానాల సహాయంతో చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అక్సాయ్ చిన్ లోని చైనా ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు ఈ రఫేల్ విమానాల ద్వారా గుర్తిస్తున్నట్టు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు ఈ విమానాలు పహారా కాస్తున్నాయి. ఇక ఇండియా మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా, అందులో తొలివిడతగా ఐదు విమానాలను డెలివరీ చేసిన సంగతి తెలిసిందే.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment