జులై 29 వ తేదీన ఇండియాకు ఫ్రాన్స్ నుంచి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. యుద్ధ విమానాలు ఇండియాకు రావడంతో మన రక్షణ వ్యవస్థ మరింత పెరిగింది. అయితే, ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇండియా చైనా బోర్డర్ లో రాత్రి సమయంలో నిఘా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విమానాల సహాయంతో చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అక్సాయ్ చిన్ లోని చైనా ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు ఈ రఫేల్ విమానాల ద్వారా గుర్తిస్తున్నట్టు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు ఈ విమానాలు పహారా కాస్తున్నాయి. ఇక ఇండియా మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా, అందులో తొలివిడతగా ఐదు విమానాలను డెలివరీ చేసిన సంగతి తెలిసిందే.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

Comments
Post a Comment