జులై 29 వ తేదీన ఇండియాకు ఫ్రాన్స్ నుంచి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. యుద్ధ విమానాలు ఇండియాకు రావడంతో మన రక్షణ వ్యవస్థ మరింత పెరిగింది. అయితే, ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇండియా చైనా బోర్డర్ లో రాత్రి సమయంలో నిఘా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విమానాల సహాయంతో చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అక్సాయ్ చిన్ లోని చైనా ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు ఈ రఫేల్ విమానాల ద్వారా గుర్తిస్తున్నట్టు ఆర్మీ అధికారులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు ఈ విమానాలు పహారా కాస్తున్నాయి. ఇక ఇండియా మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా, అందులో తొలివిడతగా ఐదు విమానాలను డెలివరీ చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment