Skip to main content

రిషికేశ్ లో నగ్నంగా నిలబడి వీడియో తీసుకున్న ఫ్రాన్స్ యువతి... అరెస్ట్ చేసిన పోలీసులు!

 


హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రిషికేశ్ లో ఫ్రాన్స్ కు చెందిన ఓ యువతి వివస్త్రగా నిలబడి వీడియో తీసుకుందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి గంగా నదిపై నిర్మించిన లక్షణ్ జులా (వంతెన)పై నిలబడిన ఆమె, సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆమె పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఫ్రాన్స్ కు చెందిన 27 ఏళ్ల మేరీ హెలెనే అనే యువతిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయి, విమర్శలు వచ్చిన తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తానేమీ పూర్తిగా వివస్త్రను కాలేదని, లైంగిక అఘాయిత్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశానని తెలిపింది. తాను నెక్లెస్ లను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటానని,దానికి ప్రమోషన్ నిమిత్తం ఈ పని చేశానని తమ విచారణలో పేర్కొందని స్థానిక పోలీసు అధికారి పీకే సక్లానీ వెల్లడించారు.

తాను ఈ వంతెనపై నడుస్తున్నప్పుడల్లా, పురుషుల నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని, భారత సోదరీమణులు, ఇతర మహిళలు కూడా ఇక్కడ ఇదే విధమైన వేధింపులను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని మేరీ పేర్కొంది. తాను చేసిన ఈ పని వెనుక ఎంతో ఉద్దేశం ఉందని తన చర్యను సమర్థించుకుంది. కాగా, అరెస్ట్ చేసిన తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టామని, కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆమె సెల్ ఫోన్ ను విచారణ నిమిత్తం సీజ్ చేశామని అన్నారు.


Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...