Skip to main content

రిషికేశ్ లో నగ్నంగా నిలబడి వీడియో తీసుకున్న ఫ్రాన్స్ యువతి... అరెస్ట్ చేసిన పోలీసులు!

 


హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రిషికేశ్ లో ఫ్రాన్స్ కు చెందిన ఓ యువతి వివస్త్రగా నిలబడి వీడియో తీసుకుందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి గంగా నదిపై నిర్మించిన లక్షణ్ జులా (వంతెన)పై నిలబడిన ఆమె, సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆమె పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఫ్రాన్స్ కు చెందిన 27 ఏళ్ల మేరీ హెలెనే అనే యువతిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయి, విమర్శలు వచ్చిన తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తానేమీ పూర్తిగా వివస్త్రను కాలేదని, లైంగిక అఘాయిత్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశానని తెలిపింది. తాను నెక్లెస్ లను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటానని,దానికి ప్రమోషన్ నిమిత్తం ఈ పని చేశానని తమ విచారణలో పేర్కొందని స్థానిక పోలీసు అధికారి పీకే సక్లానీ వెల్లడించారు.

తాను ఈ వంతెనపై నడుస్తున్నప్పుడల్లా, పురుషుల నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని, భారత సోదరీమణులు, ఇతర మహిళలు కూడా ఇక్కడ ఇదే విధమైన వేధింపులను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని మేరీ పేర్కొంది. తాను చేసిన ఈ పని వెనుక ఎంతో ఉద్దేశం ఉందని తన చర్యను సమర్థించుకుంది. కాగా, అరెస్ట్ చేసిన తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టామని, కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆమె సెల్ ఫోన్ ను విచారణ నిమిత్తం సీజ్ చేశామని అన్నారు.


Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...