Skip to main content

రిషికేశ్ లో నగ్నంగా నిలబడి వీడియో తీసుకున్న ఫ్రాన్స్ యువతి... అరెస్ట్ చేసిన పోలీసులు!

 


హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రిషికేశ్ లో ఫ్రాన్స్ కు చెందిన ఓ యువతి వివస్త్రగా నిలబడి వీడియో తీసుకుందని ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి గంగా నదిపై నిర్మించిన లక్షణ్ జులా (వంతెన)పై నిలబడిన ఆమె, సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆమె పెట్టగా, అది వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఫ్రాన్స్ కు చెందిన 27 ఏళ్ల మేరీ హెలెనే అనే యువతిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయి, విమర్శలు వచ్చిన తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తానేమీ పూర్తిగా వివస్త్రను కాలేదని, లైంగిక అఘాయిత్యాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేశానని తెలిపింది. తాను నెక్లెస్ లను ఆన్ లైన్ లో విక్రయిస్తుంటానని,దానికి ప్రమోషన్ నిమిత్తం ఈ పని చేశానని తమ విచారణలో పేర్కొందని స్థానిక పోలీసు అధికారి పీకే సక్లానీ వెల్లడించారు.

తాను ఈ వంతెనపై నడుస్తున్నప్పుడల్లా, పురుషుల నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని, భారత సోదరీమణులు, ఇతర మహిళలు కూడా ఇక్కడ ఇదే విధమైన వేధింపులను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని మేరీ పేర్కొంది. తాను చేసిన ఈ పని వెనుక ఎంతో ఉద్దేశం ఉందని తన చర్యను సమర్థించుకుంది. కాగా, అరెస్ట్ చేసిన తరువాత వ్యక్తిగత పూచీకత్తుపై విడిచి పెట్టామని, కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆమె సెల్ ఫోన్ ను విచారణ నిమిత్తం సీజ్ చేశామని అన్నారు.


Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...