Skip to main content

టీపీఏల ప్రమేయం లేకుండా.. ఇక నేరుగా ఆరోగ్య బీమా క్లెయిమ్‌..!



దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ క్లెయిమ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీదారులు ఇక నుంచి టీపీఏల (థర్‌ పార్టీ అడ్మినిస్ర్టేటర్ల) ప్రమేయం లేకుండా నేరుగా బీమా కంపెనీకే క్లెయిమ్‌ పంపించుకోవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

దీంతో టీపీఏల పాత్ర పూర్తిగా తొలగిపోయి బీమా కంపెనీల అంతర్గత బృందాలే క్లెయిమ్‌ పరిష్కారంపై నిర్ణయం ప్రకటించాల్సి వస్తుంది. ఇక నుంచి టీపీఏలు బీమా కంపెనీల తరఫున ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిశీలన, చెల్లింపు బాధ్యత తీసుకోనక్కరలేదంటూ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పాలసీదారులు తమ క్లెయిమ్‌ కోసం టీపీఏను సంప్రదించాల్సి వచ్చేది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. క్లెయిమ్‌ల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో బీమా కంపెనీలు చెల్లింపులు త్వరితం చేసేందుకు అంతర్గత బృందాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే టీపీఏ పలు బీమా సంస్థలకు పని చేస్తుండటమే ఈ జాప్యానికి కారణమని, దానికి బదులు అంతర్గత బృందాలకే బాధ్యత అప్పగిస్తే క్లెయిమ్‌ సత్వరమే పరిష్కరించవచ్చని ఐఆర్‌డీఏఐ భావించింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.