Skip to main content

టీపీఏల ప్రమేయం లేకుండా.. ఇక నేరుగా ఆరోగ్య బీమా క్లెయిమ్‌..!



దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ క్లెయిమ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీదారులు ఇక నుంచి టీపీఏల (థర్‌ పార్టీ అడ్మినిస్ర్టేటర్ల) ప్రమేయం లేకుండా నేరుగా బీమా కంపెనీకే క్లెయిమ్‌ పంపించుకోవచ్చని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

దీంతో టీపీఏల పాత్ర పూర్తిగా తొలగిపోయి బీమా కంపెనీల అంతర్గత బృందాలే క్లెయిమ్‌ పరిష్కారంపై నిర్ణయం ప్రకటించాల్సి వస్తుంది. ఇక నుంచి టీపీఏలు బీమా కంపెనీల తరఫున ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిశీలన, చెల్లింపు బాధ్యత తీసుకోనక్కరలేదంటూ ఐఆర్‌డీఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పాలసీదారులు తమ క్లెయిమ్‌ కోసం టీపీఏను సంప్రదించాల్సి వచ్చేది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. క్లెయిమ్‌ల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో బీమా కంపెనీలు చెల్లింపులు త్వరితం చేసేందుకు అంతర్గత బృందాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకే టీపీఏ పలు బీమా సంస్థలకు పని చేస్తుండటమే ఈ జాప్యానికి కారణమని, దానికి బదులు అంతర్గత బృందాలకే బాధ్యత అప్పగిస్తే క్లెయిమ్‌ సత్వరమే పరిష్కరించవచ్చని ఐఆర్‌డీఏఐ భావించింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...