Skip to main content

కరోనా బారినపడి కోలుకున్న ‘వదినమ్మ’ నటి శివపార్వతి.. నటుడు ప్రభాకర్‌పై సంచలన వ్యాఖ్యలు

 

బుల్లితెర ప్రముఖ నటి, ‘వదినమ్మ’ ఫేం శివపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె కోలుకుని నిన్న రాత్రే ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తాను అనుభవించిన మానసిక సంఘర్షణకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ‘వదినమ్మ’ యూనిట్‌పైనా, ఆ సీరియల్‌ను నిర్మిస్తూ, నటిస్తున్న ప్రభాకర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


కరోనా బారినపడి రెండు ఆసుపత్రులు మారిన విషయం ప్రభాకర్‌కు, యూనిట్‌కు తెలుసని, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన గురించి పట్టించుకోలేదని, కనీసం ఎక్కడ ఉన్నాను? ఎలా ఉన్నానన్న విషయం గురించి కూడా ఎవరూ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదని, పైపెచ్చు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

తనకు కనుక ఈ పరిస్థితి రాకుంటే ఎవరెలాంటివారన్న విషయం తెలిసేది కాదని శివపార్వతి తెలిపారు. ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా ప్రాణం ఒకటేనని, ఆపద కూడా ఒకటేనని పేర్కొన్న ఆమె.. కరోనా వైరస్ అనేది చిన్న విషయం కాదన్న విషయం మొత్తం ప్రపంచానికి తెలుసన్నారు. ఆర్టిస్టుల మధ్య ఓ అనుబంధం ఉంటుందని, కలిసి పనిచేస్తున్నప్పుడు అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ తోడుండరని, ప్రభాకర్ నుంచి తానేమీ పెద్దగా ఆశించడం లేదని అన్నారు. తాము కూడా అలాగే ఉండాలని, నటించి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలని అన్నారు. మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోయిన తర్వాత కూడా ఇలాగే స్పందిస్తారేమోనని, ఎవరికీ తెలియనివ్వకుండా సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారని అన్నారు.

ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచితే చనిపోతారనుకున్న వారికి కూడా బలం వస్తుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. తాను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవితా రాజశేఖర్ ఆసుపత్రికి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశారని శివపార్వతి చెప్పుకొచ్చారు.  

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

విశాఖ శంకుస్థాపనకు మోదీని పిలుస్తాం: బొత్స

  ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తామని... అదే విధంగా విశాఖ శంకుస్థాపనకు కూడా ప్రధాని మోదీతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అమరావతిని కూడా చంద్రబాబు గ్రాఫిక్స్ మాదిరి కాకుండా నిజంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అమరావతిలో పెండిగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాని, ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా, ఆర్బాటాలకు పోయి, అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని చెప్పారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని చెప్పారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను తామే పోషించుకుంటూ, న్యాయస్థానాలకు లోబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజం, నిజాయతీనే ఎప్పటికీ నిలుస్తాయని చెప్పారు.