Skip to main content

కరోనా బారినపడి కోలుకున్న ‘వదినమ్మ’ నటి శివపార్వతి.. నటుడు ప్రభాకర్‌పై సంచలన వ్యాఖ్యలు

 

బుల్లితెర ప్రముఖ నటి, ‘వదినమ్మ’ ఫేం శివపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె కోలుకుని నిన్న రాత్రే ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తాను అనుభవించిన మానసిక సంఘర్షణకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ‘వదినమ్మ’ యూనిట్‌పైనా, ఆ సీరియల్‌ను నిర్మిస్తూ, నటిస్తున్న ప్రభాకర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


కరోనా బారినపడి రెండు ఆసుపత్రులు మారిన విషయం ప్రభాకర్‌కు, యూనిట్‌కు తెలుసని, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన గురించి పట్టించుకోలేదని, కనీసం ఎక్కడ ఉన్నాను? ఎలా ఉన్నానన్న విషయం గురించి కూడా ఎవరూ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదని, పైపెచ్చు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

తనకు కనుక ఈ పరిస్థితి రాకుంటే ఎవరెలాంటివారన్న విషయం తెలిసేది కాదని శివపార్వతి తెలిపారు. ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా ప్రాణం ఒకటేనని, ఆపద కూడా ఒకటేనని పేర్కొన్న ఆమె.. కరోనా వైరస్ అనేది చిన్న విషయం కాదన్న విషయం మొత్తం ప్రపంచానికి తెలుసన్నారు. ఆర్టిస్టుల మధ్య ఓ అనుబంధం ఉంటుందని, కలిసి పనిచేస్తున్నప్పుడు అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ తోడుండరని, ప్రభాకర్ నుంచి తానేమీ పెద్దగా ఆశించడం లేదని అన్నారు. తాము కూడా అలాగే ఉండాలని, నటించి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలని అన్నారు. మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోయిన తర్వాత కూడా ఇలాగే స్పందిస్తారేమోనని, ఎవరికీ తెలియనివ్వకుండా సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారని అన్నారు.

ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచితే చనిపోతారనుకున్న వారికి కూడా బలం వస్తుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. తాను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవితా రాజశేఖర్ ఆసుపత్రికి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశారని శివపార్వతి చెప్పుకొచ్చారు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...