Skip to main content

కరోనా బారినపడి కోలుకున్న ‘వదినమ్మ’ నటి శివపార్వతి.. నటుడు ప్రభాకర్‌పై సంచలన వ్యాఖ్యలు

 

బుల్లితెర ప్రముఖ నటి, ‘వదినమ్మ’ ఫేం శివపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె కోలుకుని నిన్న రాత్రే ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తాను అనుభవించిన మానసిక సంఘర్షణకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ‘వదినమ్మ’ యూనిట్‌పైనా, ఆ సీరియల్‌ను నిర్మిస్తూ, నటిస్తున్న ప్రభాకర్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


కరోనా బారినపడి రెండు ఆసుపత్రులు మారిన విషయం ప్రభాకర్‌కు, యూనిట్‌కు తెలుసని, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా తన గురించి పట్టించుకోలేదని, కనీసం ఎక్కడ ఉన్నాను? ఎలా ఉన్నానన్న విషయం గురించి కూడా ఎవరూ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో తాను ఎవరినీ తప్పుబట్టాలనుకోవడం లేదని, పైపెచ్చు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

తనకు కనుక ఈ పరిస్థితి రాకుంటే ఎవరెలాంటివారన్న విషయం తెలిసేది కాదని శివపార్వతి తెలిపారు. ఎంత పెద్ద ఆర్టిస్టు అయినా ప్రాణం ఒకటేనని, ఆపద కూడా ఒకటేనని పేర్కొన్న ఆమె.. కరోనా వైరస్ అనేది చిన్న విషయం కాదన్న విషయం మొత్తం ప్రపంచానికి తెలుసన్నారు. ఆర్టిస్టుల మధ్య ఓ అనుబంధం ఉంటుందని, కలిసి పనిచేస్తున్నప్పుడు అది మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో ఎవరికి ఎవరూ తోడుండరని, ప్రభాకర్ నుంచి తానేమీ పెద్దగా ఆశించడం లేదని అన్నారు. తాము కూడా అలాగే ఉండాలని, నటించి అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఆ మనుషులను అక్కడితో మర్చిపోవాలని అన్నారు. మనుషుల మధ్య సంబంధాలు అలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోయిన తర్వాత కూడా ఇలాగే స్పందిస్తారేమోనని, ఎవరికీ తెలియనివ్వకుండా సైలెంట్‌గా సీరియల్ చిత్రీకరణ జరుపుతారని అన్నారు.

ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచితే చనిపోతారనుకున్న వారికి కూడా బలం వస్తుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. తాను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా జీవితా రాజశేఖర్ ఆసుపత్రికి వచ్చి తన పరిస్థితి తెలుసుకుని సాయం చేశారని శివపార్వతి చెప్పుకొచ్చారు.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.