Skip to main content

కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై నేడు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం


కరోనాకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని రష్యా ప్రకటించుకున్న నేపథ్యంలో, కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ నేడు కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు భాగం కానున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.

ఇదే ప్యానల్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్దన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి రేణు స్వరూప్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తదితరులు సభ్యులుగా ఉంటారు. కాగా, రష్యా చేసిన ప్రకటనపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ నిరాకరించింది. రష్యా వ్యాక్సిన్ ను ఇండియాకు దిగుమతి చేస్తారా? అన్న ప్రశ్నపై భూషణ్ స్పందిస్తూ, వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడం, తయారీకి అవసరమైన నిధులు, ఎన్ని డోస్ లు అవసరపడతాయి అనే విషయాలను చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అంతర్గత చర్చల ద్వారానే ముందడుగు వేస్తామని, ఈ విషయంలో అందరి అభిప్రాయాలనూ తీసుకుంటామని అన్నారు.

కాగా, ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్ లు క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, కాడిలా హెల్త్ కేర్ వ్యాక్సిన్ లు తొలి దశను పూర్తి చేసుకుని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఈ రెండు సంస్థలూ స్వదేశీ పరిజ్ఞానంతోనే వ్యాక్సిన్ తయారు చేశాయన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పుణె కేంద్రంగా నడుస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ను ఇండియాలో నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ లలో దేని పనితీరు మెరుగ్గా ఉంటే, దాన్ని అందుబాటులోకి తెచ్చి, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఇవ్వాలన్నది ప్రభుత్వ అభిమతం

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...