Skip to main content

అప్పుల అంబానీ రఫేల్ డీల్ తో కోలుకుంటారా?

  


భారత దేశానికి ఫ్రాన్స్ దేశం తయారు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు డెలివరీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీ సంస్థ పాత్రపై మరోసారీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

రఫేల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ దస్ ఏవియేషన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్  లిమిటెడ్ ను తన ఆఫ్ సెట్ భాగస్వామిగా చేసుకుంది. దీనిపై దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

దేశ రక్షణ రంగానికి విమానాలు తయారు చేసే ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ ఉండగా దివాలా తీసిన అంబానీ సంస్థతో ఏకంగా దస్ ఏవియేషన్ రూ.30000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తన దగ్గర ఏవీ లేవని.. దివాళా తీశానని ఓ కేసులో లండన్ కోర్టులో రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీ చేతులెత్తేశారు. మరి ఈ కీలకమైన రక్షణ ఒప్పందంలో అనిల్ ఎలా భాగస్వామి అయ్యారు.? ఎందుకు ఇందులో చేర్చుకున్నారన్నది పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రక్షణ రంగంలో అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అవినీతే అని.. ఇందులో మోడీ సర్కార్ కుంభకోణం చేసిందని ఆరోపించాయి.

అయితే రఫేల్ డీల్ తో 30వేల కోట్ల నిధులు అనిల్ సంస్థలోకి చేరాయి. మరి ఈ కోట్లతోనైనా అనిల్ సంస్థ నిలబడుతుందా? వేల కోట్ల అప్పులపాలై దివాళా తీసిన అనిల్ ను రక్షిస్తుందా అంటే లేదు అని ఆర్థిక నిపుణులు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...