Skip to main content

అప్పుల అంబానీ రఫేల్ డీల్ తో కోలుకుంటారా?

  


భారత దేశానికి ఫ్రాన్స్ దేశం తయారు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు డెలివరీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీ సంస్థ పాత్రపై మరోసారీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

రఫేల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ దస్ ఏవియేషన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్  లిమిటెడ్ ను తన ఆఫ్ సెట్ భాగస్వామిగా చేసుకుంది. దీనిపై దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

దేశ రక్షణ రంగానికి విమానాలు తయారు చేసే ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ ఉండగా దివాలా తీసిన అంబానీ సంస్థతో ఏకంగా దస్ ఏవియేషన్ రూ.30000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తన దగ్గర ఏవీ లేవని.. దివాళా తీశానని ఓ కేసులో లండన్ కోర్టులో రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీ చేతులెత్తేశారు. మరి ఈ కీలకమైన రక్షణ ఒప్పందంలో అనిల్ ఎలా భాగస్వామి అయ్యారు.? ఎందుకు ఇందులో చేర్చుకున్నారన్నది పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రక్షణ రంగంలో అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అవినీతే అని.. ఇందులో మోడీ సర్కార్ కుంభకోణం చేసిందని ఆరోపించాయి.

అయితే రఫేల్ డీల్ తో 30వేల కోట్ల నిధులు అనిల్ సంస్థలోకి చేరాయి. మరి ఈ కోట్లతోనైనా అనిల్ సంస్థ నిలబడుతుందా? వేల కోట్ల అప్పులపాలై దివాళా తీసిన అనిల్ ను రక్షిస్తుందా అంటే లేదు అని ఆర్థిక నిపుణులు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...