Skip to main content

అప్పుల అంబానీ రఫేల్ డీల్ తో కోలుకుంటారా?

  


భారత దేశానికి ఫ్రాన్స్ దేశం తయారు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు డెలివరీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీ సంస్థ పాత్రపై మరోసారీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

రఫేల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ దస్ ఏవియేషన్ అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్  లిమిటెడ్ ను తన ఆఫ్ సెట్ భాగస్వామిగా చేసుకుంది. దీనిపై దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

దేశ రక్షణ రంగానికి విమానాలు తయారు చేసే ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ ఉండగా దివాలా తీసిన అంబానీ సంస్థతో ఏకంగా దస్ ఏవియేషన్ రూ.30000 కోట్ల ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తన దగ్గర ఏవీ లేవని.. దివాళా తీశానని ఓ కేసులో లండన్ కోర్టులో రిలయన్స్ అడాగ్ అధినేత అనిల్ అంబానీ చేతులెత్తేశారు. మరి ఈ కీలకమైన రక్షణ ఒప్పందంలో అనిల్ ఎలా భాగస్వామి అయ్యారు.? ఎందుకు ఇందులో చేర్చుకున్నారన్నది పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు విమర్శించాయి. రక్షణ రంగంలో అనుభవం లేని అనిల్ అంబానీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అవినీతే అని.. ఇందులో మోడీ సర్కార్ కుంభకోణం చేసిందని ఆరోపించాయి.

అయితే రఫేల్ డీల్ తో 30వేల కోట్ల నిధులు అనిల్ సంస్థలోకి చేరాయి. మరి ఈ కోట్లతోనైనా అనిల్ సంస్థ నిలబడుతుందా? వేల కోట్ల అప్పులపాలై దివాళా తీసిన అనిల్ ను రక్షిస్తుందా అంటే లేదు అని ఆర్థిక నిపుణులు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.