Skip to main content

మహేష్ ను వదలనంటున్న డైరెక్టర్...

 సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే నమ్మకంతో ‘ఆగడు’ సినిమాకు ఒకే చెప్పాడు మహేష్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. ఆ దెబ్బతో శ్రీను వైట్ల అంటే బాబోయ్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ‘ఆగడు’ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. 'ఆగడు' సినిమా నుండి శ్రీను వైట్ల తన హిట్ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా ప్లాఫ్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ తో తీసిన 'బ్రూస్ లీ'.. వరుణ్ తేజ్ 'మిస్టర్'.. రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.ఇప్పుడు 'దూకుడు' సినిమాకి సీక్వెల్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కి 'దూకుడు 2' స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీను వైట్ల ప్రయత్నానికి మహేష్ ఓకే చెప్తాడా లేదా అనేది చూడాలి. దీంతో పాటు శ్రీను వైట్ల 'ఢీ' సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మంచు విష్ణుతో ఈ విషయంపై డిస్కషన్స్ కూడా జరిగినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.