Skip to main content

మహేష్ ను వదలనంటున్న డైరెక్టర్...

 సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అదే నమ్మకంతో ‘ఆగడు’ సినిమాకు ఒకే చెప్పాడు మహేష్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. ఆ దెబ్బతో శ్రీను వైట్ల అంటే బాబోయ్ అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ‘ఆగడు’ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. 'ఆగడు' సినిమా నుండి శ్రీను వైట్ల తన హిట్ ఫార్ములాతో తీసిన ప్రతి సినిమా ప్లాఫ్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ తో తీసిన 'బ్రూస్ లీ'.. వరుణ్ తేజ్ 'మిస్టర్'.. రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.ఇప్పుడు 'దూకుడు' సినిమాకి సీక్వెల్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కి 'దూకుడు 2' స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు చేస్తున్నారట. శ్రీను వైట్ల ప్రయత్నానికి మహేష్ ఓకే చెప్తాడా లేదా అనేది చూడాలి. దీంతో పాటు శ్రీను వైట్ల 'ఢీ' సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మంచు విష్ణుతో ఈ విషయంపై డిస్కషన్స్ కూడా జరిగినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...