వార్షిక కౌలు చెల్లింపు కోసం డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు నిన్న విజయవాడలో ముట్టడికి యత్నించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామని, కానీ విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల రైతులకు కౌలు చెల్లించడంలో ఆలస్యమైందని వెల్లడించారు. కాగా, అమరావతి కౌలు రైతులకు పెన్షన్ రూ.5 వేల వరకు పెంచాలని భావించినా, ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంలో వీలుపడలేదని బొత్స వెల్లడించారు. అందువల్లే ఈసారి రూ.2,500 చెల్లించామని వివరించారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment