బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా వల్ల కన్నుమూశారు. కరోనా
బారిన పడిన ఆయన... నెల క్రితం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరి, చికిత్స
తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఆయన వయసు 60 సంవత్సరాలు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి
గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఏపీ
దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు
దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

Comments
Post a Comment