Skip to main content

శ్రీదేవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి: ఉద్యమం ప్రారంభించిన అభిమానులు



 ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ ప్రారంభమైంది. అయితే, ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం దుబాయ్‌లో ప్రాణాలు కోల్పోయిన శ్రీదేవి కేసులో కూడా సీబీఐ విచారణ జరపాలని ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం ప్రారంభించారు.  

 
దుబాయ్‌లో ఓ వేడుకకు వెళ్లి అక్కడే తాను ఉన్న హోట‌ల్ గదిలోని బాత్ ట‌బ్‌లో ప‌డి శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సందర్భంగా ఆమె మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె అభిమానులు ఇప్పటికీ  అనుమానాలను వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.  

సుశాంత్ మృతిలో సీబీఐ విచారణ కొనసాగుతుండడం, ఆగ‌స్టు 13న శ్రీదేవి జయంతి ఉండడం వంటి అంశాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు సీబీఐ ఎంక్వైరీ ఫ‌ర్ శ్రీదేవి హ్యాష్ ట్యాగ్‌తో ఆమె మృతిపై విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఈ డిమాండ్ ఊపందుకోవడం గమనార్హం.  

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...